Delhi Liquor Case: ఇవన్నీ టైమ్ వేస్ట్ వ్యవహరాలు.. ఆప్ ఎంపీ కస్టడీపై సీఎం కేజ్రీవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఈ రోజు ఆయనకు కోర్టు అక్టోబర్ 10 వరకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అంతకుముందు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్తో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు జైలులో ఉన్నారు. బుధవారం రోజు ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిలో 10 గంటల పాటు ఈడీ విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసింది.
చావడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ భయపడను.. ప్రధాని నరేంద్రమోడీ, అదానీ అవినీతి గురించి నిరంతరం మాట్లాడుతాను, అదానీ అవినీతి గురించి ఇప్పటి వరకు ఈడీకి చాలా ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని అరెస్ట్ తర్వాత విడుదల చేసిన వీడియోలో సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆప్ పార్టీని దెబ్బతీయడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీలతో దాడులు చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిని చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని విమర్శిస్తున్నాయి.
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
Read Also: India-Canada: “అంతర్గత విషయాల్లో జోక్యం”.. కెనడా దౌత్యవేత్తల తగ్గింపుపై భారత్..
ఇదిలా ఉంటే సంజయ్ సింగ్ అరెస్టుపై ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ తీరును దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసు తప్పుడు కేసని, దర్యాప్తులో ఏం బయటపడలేదని, దర్యాప్తు సంస్థలు టైమ్ వేస్ట్ చేస్తున్నాయని, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టడం వల్ల దేశం అభివృద్ధి చెందదని ఆయన అన్నారు. అంతకుముందు మనీష్ సిసోడియా బెయిల్ విచారణలో సుప్రీంకోర్టు,ఈడీని ఆధారాలపై ప్రశ్నించడాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ రోజు మనీష్ సిసోడియా బెయిల్పై విచారించిన సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థలకు కీలక ప్రశ్నలు సంధించింది. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా..? అని ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూరే విధంగా ఈ మధ్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ ఆరోపించింది. ఇందుకు కొన్ని వాట్సాప్ మెసేజులను సాక్ష్యంగా సీబీఐ సమర్పించింది. అయితే ఈ మెసేజుల ఆమోదయోగ్యతను సుప్రీం ప్రశ్నించింది. ఈ కేసులో లంచాలపై విజయ్ నాయర్, మనీష్ సిసోడియా మాట్లాడుకోవడం చూశారా..? అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఎలా సాక్ష్యంగా పరిగణించగలమని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
-
Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!