Supreme Court: హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆ ఉత్తర్వులు ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులు కేటాయించ వద్దన్న జీవో నెంబర్ 425పై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో అన్య మతస్థులకు దుకాణాలు కేటాయించ వద్దని 2015లో ప్రభుత్వం జీవో 425 జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో 425 ను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు 2020లో జీవోపై స్టే విధించింది. స్టే విధించినప్పటికీ ప్రభుత్వం మళ్లీ టెండర్లను పిలిచింది.…
భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సోమవారమే జ్ఞానేష్ కుమార్ను సీఈసీగా కేంద్రం నియమించింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జ్ఞానేష్ కుమార్ వ్యతిరేకంగా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
Supreme Court: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమ పిటిషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో, ఈ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పీకర్…
తమిళనాడులో ఒక కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి రెండు చేతులు నరకడం అమానుషానికి పరాకాష్ట అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమారు ఆవేదన వ్యక్తం చేశారు.. శుక్రవారం రాజమండ్రిలో జీవీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బుల్లెట్ నడిపితే అంత వివక్ష చెందాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
నేడు సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. తాజాగా మోహన్ బాబు పిటిషన్పై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. పహాడీషరీఫ్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగింది. సీనియర్ న్యాయవాది వాదిస్తాడని సమయం కావాలని మోహన్బాబు తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలొ మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది.…
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటర్లపై పార్టీలు ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది