Supreme Court: ‘‘13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్’’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- 13 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వినియోగించకుండా బ్యాన్..
- పిటిషన్ని విచారించేందుకు నో చెప్పిన సుప్రీంకోర్టు..
- విధానపరమైన విషయమని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలనే పిటిషన్ని ఈ రోజు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ని విచారించేందుకు నో చెప్పింది. ఇది విధానపరమైన విషయమని, మీరు పార్లమెంట్ చట్టం చేయాలని అడగాలని ధర్మాసనం పిటిషనర్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జస్టిన్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం, దీనిపై సంబంధిత అధికార యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్వేచ్ఛని ఇచ్చింది.
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు”ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
సోషల్ మీడియా పిల్లల మనస్సులపై చూసే తీవ్రమైన శారీరక, మానసిన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని పిటిషన్ ప్రస్తావించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారామ్స్ పిల్లలకు యాక్సెస్ నియంత్రించేందుకు బయోమెట్రిక్ ప్రామాణీకరణ, వయసు ధ్రువీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించాలని పిటిషన్ కోరింది. ‘‘ఇది విధానపరమైన విషయమని, మీరు పార్లమెంట్ చట్టం రూపొందించాలని అడగాలి’’ అని సుప్రీంకోర్టు పిటిషనర్ న్యాయవాదికి తెలిపింది. సంబంధిత అథారిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చే స్వేచ్ఛ ఇస్తూనే, పిటిషనర్ రిప్రజెంటేషన్ ఇస్తే, అది 8 వారాల్లో పరిగణించబడుతుందని అని కోర్టు తెలిపింది.
జెప్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్, 13 – 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు తప్పనిసరి తల్లిదండ్రుల నియంత్రణల నిబంధనలను, రియల్-టైమ్ పర్యవేక్షణ సాధనాలు, కఠినమైన వయస్సు ధృవీకరణ, కంటెంట్ పరిమితులను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్లో చేర్చాలని కేంద్రం, ఇతరులకు ఆదేశాలు కోరింది. సోషల్ మీడియా అతి వినియోగంపై మైనర్లు తీవ్రమైన మానసిక క్షోభ, సామాజిక ఒంటరితనం, వ్యవసం లాంటి తీవ్రమైన పరిస్థితులతో బాధపడుతున్నారని, పరిశోధనలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని పిటిషన్ పేర్కొంది. దేశ జనాభాలో దాదాపు 30 శాతం మంది నాలుగు నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!