Supreme Court: ‘‘13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్’’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- 13 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వినియోగించకుండా బ్యాన్..
- పిటిషన్ని విచారించేందుకు నో చెప్పిన సుప్రీంకోర్టు..
- విధానపరమైన విషయమని కామెంట్స్..
Supreme Court: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలనే పిటిషన్ని ఈ రోజు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ని విచారించేందుకు నో చెప్పింది. ఇది విధానపరమైన విషయమని, మీరు పార్లమెంట్ చట్టం చేయాలని అడగాలని ధర్మాసనం పిటిషనర్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జస్టిన్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం, దీనిపై సంబంధిత అధికార యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్వేచ్ఛని ఇచ్చింది.
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు”ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్..
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
సోషల్ మీడియా పిల్లల మనస్సులపై చూసే తీవ్రమైన శారీరక, మానసిన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని పిటిషన్ ప్రస్తావించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారామ్స్ పిల్లలకు యాక్సెస్ నియంత్రించేందుకు బయోమెట్రిక్ ప్రామాణీకరణ, వయసు ధ్రువీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించాలని పిటిషన్ కోరింది. ‘‘ఇది విధానపరమైన విషయమని, మీరు పార్లమెంట్ చట్టం రూపొందించాలని అడగాలి’’ అని సుప్రీంకోర్టు పిటిషనర్ న్యాయవాదికి తెలిపింది. సంబంధిత అథారిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చే స్వేచ్ఛ ఇస్తూనే, పిటిషనర్ రిప్రజెంటేషన్ ఇస్తే, అది 8 వారాల్లో పరిగణించబడుతుందని అని కోర్టు తెలిపింది.
జెప్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్, 13 – 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు తప్పనిసరి తల్లిదండ్రుల నియంత్రణల నిబంధనలను, రియల్-టైమ్ పర్యవేక్షణ సాధనాలు, కఠినమైన వయస్సు ధృవీకరణ, కంటెంట్ పరిమితులను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్లో చేర్చాలని కేంద్రం, ఇతరులకు ఆదేశాలు కోరింది. సోషల్ మీడియా అతి వినియోగంపై మైనర్లు తీవ్రమైన మానసిక క్షోభ, సామాజిక ఒంటరితనం, వ్యవసం లాంటి తీవ్రమైన పరిస్థితులతో బాధపడుతున్నారని, పరిశోధనలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని పిటిషన్ పేర్కొంది. దేశ జనాభాలో దాదాపు 30 శాతం మంది నాలుగు నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో