CPI Narayana: భూముల ధరలు పెరగడంతో అందరి కన్ను హెచ్సీయూ భూములపైనే.. గతంలోనూ..
- సుప్రీంకోర్టు దాకా హెచ్సీయూ భూముల అంశం వచ్చింది
- కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి
- ఇందిరాగాంధీ హయాంలో భూములు కేటాయించారు
- భూముల ధరలు పెరగడంతో అందరి కన్ను పడింది
- సీపీఐ నారాయణ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీపీఐ నేత నారాయణ హెచ్సీయూ భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో హెచ్సీయూ కోసం భూములు కేటాయించారని, కానీ భూముల ధరలు పెరగడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ భూములపై పడిందని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే అప్పట్లోనే ఈ భూములు విద్యా వ్యవస్థకే కేటాయించినవని తాము స్పష్టంగా చెప్పామని నారాయణ గుర్తు చేశారు. విద్య కోసం కేటాయించిన భూములు అదే ప్రయోజనానికి ఉపయోగించాలే తప్ప, వాణిజ్య అవసరాల కోసం వినియోగించకూడదని హెచ్చరించారు. జనాభా పెరుగుతుందని, కానీ భూమి పెరగదని, అందుకే ప్రభుత్వ భూములను అమ్మకూడదని నారాయణ పేర్కొన్నారు.
READ MORE: Pharmacist Death: పార్మసిస్ట్ నాగాంజలి మృతి.. నిందితుడు దీపక్పై హత్య కేసు నమోదు చేస్తాం: డీఎస్పీ
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
గత ప్రభుత్వాలు భూములు అమ్మాయని, అయితే ఇప్పుడు వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నారని ఆయన తెలిపారు. చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఈ భూములు వచ్చాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వానికి హెచ్సీయూ భూముల విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ భూముల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని, యూనివర్సిటీ భూములను వ్యాపార వస్తువుగా చూడొద్దని నారాయణ స్పష్టం చేశారు. విద్యార్థులను కొడుతూనే, భూములు అమ్మే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయాలు, వ్యక్తిగత మిత్రబంధాలు వేరు, కానీ ప్రస్తుత సమస్య వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కారని నారాయణ వ్యాఖ్యానించారు.
READ MORE: NANI : హిట్ 3 లీక్స్.. శైలేష్ ఎమోషనల్ పోస్ట్
వక్ఫ్ బిల్లుపై కూడా నారాయణ విమర్శలు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో లౌకిక వ్యవస్థకు చీకటి రోజులు వచ్చాయని అన్నారు. రెండు సభలను బుల్డోజ్ చేశారని, రాజ్యాంగానికి విలువ లేకుండా పోయిందని అన్నారు. దీని వల్ల మతపర ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదని, లౌకిక వ్యవస్థను పాడు చేసే హక్కు వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదమైనా, తమ ఆందోళనలు బయట కొనసాగుతాయని నారాయణ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!