MLA Defection Case: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఇదే చివరి అవకాశం అంటూ కోర్టు స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఈలోపే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని ధర్మాసనం పేర్కొంది. ఇకపై కూడా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే తగిన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు స్పీకర్కు హెచ్చరించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. Vijay…
నగదు కుంభకోణం కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న పార్లమెంటరీ ప్యానెల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను తాజాగా న్యాయస్థానం కొట్టేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ-ఈడీ మధ్య నెలకొన్న ఫైటింగ్ సుప్రీంకోర్టుకు చేరింది. గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సర్కార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆరోపణలు చేసింది.
తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను అత్యున్నత న్యాయస్థానంలో బలంగా వినిపించబోతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఈ అంశంపై ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ, సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చిన సూచనల…
గత వారం కోల్కతాలో ఐ-ప్యాక్ కార్యాలయంపై ఈడీ ఊహించని రీతిలో దాడి చేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడుల వార్తలు వినగానే వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనాస్థలికి చేరుకుని అడ్డుకున్నారు. కీలకమైన పత్రాలు, హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీం కోర్టులో జరగనున్న కీలక విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు , లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తితో పాటు ఇంటర్ స్టేట్…
Supreme Court: వీధికుక్కలకు సంబంధించిన కేసును గురువారం జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగించింది. జంతు ప్రేమికులు, కుక్క కాటు బాధితులు, జంతు హక్కుల కార్యకర్తలు తమ వాదనల్ని సమర్పించారు. జంతు సంక్షేమ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సియూ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కులు ఢిల్లీలో సమతుల్యతను కాపాడుతున్నాయని, ఇవి ఎలుకలు, కోతుల ముప్పును రక్షిస్తున్నాయని, కుక్కలను హఠాత్తుగా తొలగిస్తే ఎలుకల…
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఫిబ్రవరి 2020 అల్లర్ల కేసులో బెయిల్ నిరాకరిస్తూ సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.