Imran khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఫుడ్ మెనూ విడుదల చేసిన ప్రభుత్వం
- ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు
- బయటకు వచ్చిన ఫుడ్ మెనూ
- ఆరోగ్యంగా ఉన్నారన్న అడియాలా జైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని.. కంటి చూపును కూడా కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇంకో వైపు ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని కాపాడాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వానికి 14 దేశాలకు చెందిన మాజీ కెప్టెన్లు లేఖలు రాశారు. ఇందులో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఉన్నారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో ఉంటున్నారు.
ఫుడ్ మెనూ
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఫుడ్ మెనూను వెల్లడించింది. దేశీ చికెన్, మటన్తో పాటు డ్రైఫ్రూట్స్ పెడుతున్నట్లుగా పేర్కొంది.
Also Read
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
అడియాలా జైలులోని ఏడు గదుల ప్రత్యేక జైలు సముదాయంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారని.. సహజ వెలుతురుతో పాటు స్వచ్ఛమైన గాలి అందుతోందని పేర్కొంది. అలాగే వ్యాయామం కోసం సైక్లింగ్ యంత్రాలు, జిమ్ పరికరాలు అందించినట్లు తెలిపింది. ఇక ఆహార, పానీయాల్లో ఖర్జూరాలు, వాల్నట్లు, చికెన్, మటన్, సలాడ్, వేయించిన గుడ్లు, వివిధ ఫ్రూట్ షేక్లు అందిస్తున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Rajya sabha: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తెలంగాణలో ఎన్నంటే..!
ఎండలో కూర్చుని పుస్తకాలు, వార్తాపత్రికలు చదువుతున్నారని నివేదికలో పేర్కొంది. అల్పాహారంలో ఖర్జూరం, వాల్నట్లు, తేనె, కాఫీ, గంజి, లస్సీ, వేడి పాలు, చియా గింజలు, దానిమ్మ రసం తీసుకుంటున్నారని తెలిపింది. మధ్యాహ్న భోజనంలో దేశీ చికెన్, మటన్, సలాడ్, మిశ్రమ ఊరగాయలు, బంగాళాదుంప చిప్స్, గుడ్లు, వివిధ రకాల పప్పులు ఉన్నాయని చెప్పింది. ఇక సాయంత్రం బాదం, ఎండుద్రాక్ష, తురిమిన కొబ్బరి, పాలు, ఖర్జూరం, అరటిపండ్లు, ఆపిల్ షేక్లను తీసుకుంటున్నారని వివరించింది.
ఇది కూడా చదవండి: Silver Rates: వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
తాజావార్తలు
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Hair Care Tips: తలకు నూనె రాస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందా? నిజం ఎంత..?
-
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్ల్లోనే ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..