Mohan Bhagwat: కుక్కల బెడదపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- కుక్కల బెడదపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- నాగపూర్లో జరిగిన సదస్సులో అభిప్రాయం వ్యక్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల తర్వాత జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డాగ్ లవర్స్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇప్పటికీ అనుకూల-వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవులు, జంతువులు, ప్రకృతి సామరస్యంగా జీవించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమతుల్య సహజీవనాన్ని ఎలా నడిపించుకోవాలో సమాజం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Bangladesh Poll Results: తారిక్ రెహమాన్దే బంగ్లాదేశ్
Also Read
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
గురువారం నాగపూర్లో ఇండియన్ సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కానైన్ ప్రాక్టీస్ మరియు మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ యూనివర్సిటీ (MAFSU) సంయుక్తంగా నిర్వహించిన ‘ఒక ఆరోగ్యంలో కుక్కల పాత్ర.. భాగస్వామ్యాన్ని నిర్మించడం-సవాళ్లను పరిష్కరించడం’’ అనే అంశంపై జరిగిన జాతీయ సింపోజియంలో మోహన్ భగవత్ ప్రసంగించారు.
‘‘ఇటీవల కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఢిల్లీలో పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ అంశంపై రెండు వెర్షన్స్ వినిపించాయి. ఒక వర్గం కుక్కలను చంపాలని.. ఇంకొక వర్గం అసలు ముట్టుకోకూడదు అని. దీని గురించి నన్ను అడిగినప్పుడు మధ్య మార్గం కూడా ఉండొచ్చని చెప్పాను. కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ వంటి చర్యలు ఉపయోగించవచ్చు. ప్రమాదాలను తగ్గించడానికి.. భ్రదత కోసం అనేక చర్యలు తీసుకోవచ్చు. నేను పశువైద్యుడిని కాబట్టి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.’’ అని అన్నారు.
‘‘గతంలో పశువైద్యులకు చాలా పరిమితి ఉందని నమ్మాం. కానీ అది నిజం కాదు. మనం చాలా విస్తృత స్థాయిలో ఆలోచించాలి. కచ్చితంగా ప్రత్యేక పశువైద్య మండలి ఉండాలి. అది అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. జంతువుల గురించి నిర్ణయాలు తీసుకోవాలంటే.. వాటి గురించి తెలిసిన పశువైద్యులను గానీ.. జంతు శాస్త్ర నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి. జంతువులు గురించి అవగాహన వారికి ఉంటుంది. అవసరమైన జ్ఞానం వారికే ఉంటుంది కాబట్టి వారికి బాధ్యతలు అప్పగించాలి. ఇప్పుడు క్రీడల విషయంలో ఏం జరుగుతుంది. క్రీడా రంగానికి చెందిన వ్యక్తులే నిర్ణయం తీసుకుంటారు. అలాగే జంతువుల విషయంలో పశువైద్యులకే అవగాహన ఉంటుంది. కాబట్టి పశువైద్యుల్ని సంప్రదించి ఆ రంగాన్ని ముందుకు నడిపిస్తే.. అప్పుడు పురోగతి లభిస్తుంది.’’ అని
మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
#WATCH | Nagpur | RSS Chief Mohan Bhagwat says, "Recently, a decision was taken regarding dogs, which caused a major uproar in Delhi. Two extreme viewpoints were being discussed, one saying that all dogs should be killed, and the other saying that dogs should not be touched at… pic.twitter.com/bx0I08vaYy
— ANI (@ANI) February 13, 2026
తాజావార్తలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!