Mamata Banerjee: ‘న్యాయం ఏడుస్తోంది’.. ‘సర్’పై సుప్రీంకోర్టులో వాదనలు.. 26 కవితలతో మమత నిరసన
- హస్తిన వేదికగా ‘‘సర్’’పై మమత పోరాటం
- ‘న్యాయం ఏడుస్తోంది’
- ‘సర్’పై సుప్రీంకోర్టులో వాదనలు
- 26 కవితలతో మమత నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హస్తిన వేదికగా ‘‘సర్’’పై పోరాటానికి దిగారు. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసి తన నిరసన తెలియజేశారు. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం వేదికగా తన నిరసనను వ్యక్తపరిచారు.
ఇది కూడా చదవండి: Melinda Gates: ఎప్స్టీన్ ఫైల్ వల్లే బిల్గేట్స్తో విడిపోయా.. మాజీ భార్య మిలిందా వెల్లడి
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
ఇటీవల బెంగాల్లో ఎన్నికల సంఘం ‘‘SIR’’ నిర్వహించి 58 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక మమతనే స్వయంగా రంగంలోకి దిగి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈసీ తీరును ఎండగట్టారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల సంఘానికి తాను చాలాసార్లు లేఖ రాశానని.. ‘‘న్యాయం తలుపు వెనుక ఏడుస్తోంది.’’ అని వ్యాఖ్యానించారు. తాను తన పార్టీ తరపున వాదనలు చేయడం లేదని… పెద్ద కారణం కోసం వాదనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈసీ జారీ చేసిన వివిధ ఆదేశాలు, సూచనలు రద్దు చేయాలని కోరారు.
‘‘న్యాయం తలుపు వెనుక ఏడుస్తున్నప్పుడు… మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదని మేము అనుకున్నాము. మేము ఎన్నికల సంఘానికి 6 లేఖలు రాశాము. నేను ఒక బంధిత కార్మికుడిని… నాకు అది ఇష్టం. నేను నా పార్టీ కోసం పోరాడటం లేదు.’’ అని ఆమె చెప్పినట్లు బార్ అండ్ బెంచ్ పేర్కొంది.
కవితలు..
ఇదిలా ఉంటే ‘సర్’ ఉద్యమాన్ని మమత కొత్త స్థాయికి తీసుకెళ్లారు. దీనిపై 26 కవితలతో కూడిన పుస్తకాన్ని రాశారు. పౌరులు ఎదుర్కొంటున్న వేధింపులు, భయాన్ని కవితల రూపంలో తెలియజేశారు. ఈసీకి వ్యతిరేకంగా రాసిన కవితల పుస్తకాన్ని ఇటీవలే విడుదల చేశారు. 26 in 26 అనే శీర్షికతో రాసిన కవితా పుస్తకాన్ని జనవరి 22న 49వ అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శనలో విడుదల చేశారు. పానిక్, డూమ్, ఎగతాళి, ప్రజాస్వామ్యం ఉత్తేజకరమైన శీర్షికలు ఉన్నాయి. పుస్తకం పరిచయంలో శ్లోకాలను పొందిపరిచారు. ఇక సర్ కారణంగా నిరంతరం భయం కొనసాగుతోందని ఆరోపించారు. కొన్ని కార్యక్రమాల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు కొద్ది రోజుల్లోనే ఈ కవితలు రాశానని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.
#WATCH | Delhi: West Bengal CM Mamata Banerjee leaves after hearing in SIR matter in Supreme Court. pic.twitter.com/KmuJt9Oowa
— ANI (@ANI) February 4, 2026
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..