Mamata Banerjee: ‘న్యాయం ఏడుస్తోంది’.. ‘సర్’పై సుప్రీంకోర్టులో వాదనలు.. 26 కవితలతో మమత నిరసన
- హస్తిన వేదికగా ‘‘సర్’’పై మమత పోరాటం
- ‘న్యాయం ఏడుస్తోంది’
- ‘సర్’పై సుప్రీంకోర్టులో వాదనలు
- 26 కవితలతో మమత నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హస్తిన వేదికగా ‘‘సర్’’పై పోరాటానికి దిగారు. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసి తన నిరసన తెలియజేశారు. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం వేదికగా తన నిరసనను వ్యక్తపరిచారు.
ఇది కూడా చదవండి: Melinda Gates: ఎప్స్టీన్ ఫైల్ వల్లే బిల్గేట్స్తో విడిపోయా.. మాజీ భార్య మిలిందా వెల్లడి
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇటీవల బెంగాల్లో ఎన్నికల సంఘం ‘‘SIR’’ నిర్వహించి 58 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక మమతనే స్వయంగా రంగంలోకి దిగి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈసీ తీరును ఎండగట్టారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల సంఘానికి తాను చాలాసార్లు లేఖ రాశానని.. ‘‘న్యాయం తలుపు వెనుక ఏడుస్తోంది.’’ అని వ్యాఖ్యానించారు. తాను తన పార్టీ తరపున వాదనలు చేయడం లేదని… పెద్ద కారణం కోసం వాదనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈసీ జారీ చేసిన వివిధ ఆదేశాలు, సూచనలు రద్దు చేయాలని కోరారు.
‘‘న్యాయం తలుపు వెనుక ఏడుస్తున్నప్పుడు… మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదని మేము అనుకున్నాము. మేము ఎన్నికల సంఘానికి 6 లేఖలు రాశాము. నేను ఒక బంధిత కార్మికుడిని… నాకు అది ఇష్టం. నేను నా పార్టీ కోసం పోరాడటం లేదు.’’ అని ఆమె చెప్పినట్లు బార్ అండ్ బెంచ్ పేర్కొంది.
కవితలు..
ఇదిలా ఉంటే ‘సర్’ ఉద్యమాన్ని మమత కొత్త స్థాయికి తీసుకెళ్లారు. దీనిపై 26 కవితలతో కూడిన పుస్తకాన్ని రాశారు. పౌరులు ఎదుర్కొంటున్న వేధింపులు, భయాన్ని కవితల రూపంలో తెలియజేశారు. ఈసీకి వ్యతిరేకంగా రాసిన కవితల పుస్తకాన్ని ఇటీవలే విడుదల చేశారు. 26 in 26 అనే శీర్షికతో రాసిన కవితా పుస్తకాన్ని జనవరి 22న 49వ అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శనలో విడుదల చేశారు. పానిక్, డూమ్, ఎగతాళి, ప్రజాస్వామ్యం ఉత్తేజకరమైన శీర్షికలు ఉన్నాయి. పుస్తకం పరిచయంలో శ్లోకాలను పొందిపరిచారు. ఇక సర్ కారణంగా నిరంతరం భయం కొనసాగుతోందని ఆరోపించారు. కొన్ని కార్యక్రమాల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు కొద్ది రోజుల్లోనే ఈ కవితలు రాశానని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.
#WATCH | Delhi: West Bengal CM Mamata Banerjee leaves after hearing in SIR matter in Supreme Court. pic.twitter.com/KmuJt9Oowa
— ANI (@ANI) February 4, 2026
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!