Iran War: పర్షియన్ గల్ఫ్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్కు సానుకూల వార్త వెలువడింది. భారత్లోని ఇరాన్ రాయబారిక మొహమ్మద్ ఫతాలి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధి ద్వారా భారతదేశానికి సురక్షితమైన ప్రయాణాన్ని మంజూరు చేయవచ్చని సంకేతాలిచ్చారు.
Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తుంటే, ఇరాన్ గల్ఫ్ దేశాలపై తన ప్రతీకారం తీర్చుకుంటోంది. మరోవైపు.. ఇరాన్, యూఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’అని ట్రంప్ G7 దేశాల నాయకులతో అన్నారు. ట్రంప్ తన ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’పై గొప్పలు చెప్పుకున్నారు. ఇరాన్ రూపంలో ప్రపంచానికి పట్టిన క్యాన్సర్ను వదిలిస్తాన్నామని మిత్రదేశాలతో ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించి, హార్ముజ్ జలసంధిని సురక్షితంగా…
Cargo Ship Attacked: యూఏఈ నుంచి భారత్ వస్తున్న థాయ్ జెండా కలిగిన కార్గో షిప్ పై బుధవారం దాడి జరిగింది. యూఏఈ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఈ దాడి జరిగినట్లు థాయ్ నేవీ తెలిపింది. నౌకలోని ఇరవై మంది నావికుల్ని రక్షించారు. ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. మయూరీ నరీ అనే నౌక భారతదేశంలోని కాండ్లా ఓడరేవుకు వెళుతుండగా దాడి జరిగింది.
Iran War: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్పై ఇప్పటి వరకు జరగని విధంగా భారీ, అత్యంత తీవ్రమైన దాడికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అమెరికా తన ఫైటర్ జెట్స్, బాంబర్స్, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులతో ఇరాన్ను టార్గెట్ చేసుకుంటుందని ప్రకటించారు.
పశ్చిమాసియా యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్లో యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఇరాన్లో 5 వేల లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు.
Israel Iran War: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. కువైట్, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ ఘర్షణ ప్రారంభమై వారం గడుస్తోంది. ప్రతీ రోజూ కూడా అమాయకులు చనిపోతున్నారు. మరోవైపు హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు సంక్షోభం…
India Russia: మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వల్ల మొత్తం ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఈ యుద్ధంలో ఇరాన్ గల్ఫ్ లోని ఇతర దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్, కువైట్లపై కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది.
ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హార్ముజ్ జలసంధి ద్వారా ఏ ఓడా దాటకూడదని రేడియో సిగ్నల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఫలితంగా ఈ కీలకమైన జలమార్గం మూసివేశారు. ఇది ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై జరిపిన సంయుక్త సైనిక దాడులకు ప్రతిఘటనగా జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో భారీ మిసైల్ దాడులు చేశాయి. ఇందులో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమెనీ హత్య కూడా…
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్లో సంక్షోభాన్ని సృష్టించింది. సుప్రీంలీడర్ ఖమేనీ అంతమే లక్ష్యంగా ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడుల్ని శనివారం ప్రారంభించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని అమెరికా మిత్రదేశాలను టార్గెట్ చేసింది. కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అబుదాబి, దుబాయ్, రియాద్ వంటి నగరాలపై డ్రోన్, మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ సంచలన నిర్ణయం…
US-Iran Tension: ఇరాన్, అమెరికా మధ్య ఓ వైపు అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ అధికారులు రెండు వారాల్లో కొత్త ప్రతిపాదనతో చర్చలు జరపడానికి అంగీకరించినప్పటికీ, అమెరికా మాత్రం ఇరాన్ సమీపంలో సైన్యాన్ని మోహరిస్తూనే ఉంది.