Strait of Hormuz: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే సాగుతాయి. దీంతో ఆసియాతో పాటు యూరప్ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.
US-Iran War: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధ ప్రాధాన్యత మారింది. ఇన్నాళ్లు ఇరాన్లో పాలనా మార్పు తీసుకురావాలని, ఎన్రిచ్ యురేనియాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావించాడు. అయితే, అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరోవైపు, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఇంధన రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇప్పుడు అమెరికా చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Iran War: మిడిల్ ఈస్ట్లో యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఇరాన్పై భూతల దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఇరాన్ దిగ్బంధించిన ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరిచేందుకు ఆపరేషన్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే, హార్ముజ్ జలసంధిని తెరవడానికి యూఏఈ, సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ లోని మిత్రదేశాలు అమెరికాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
US-Iran War: ఇరాన్ యుద్ధం ప్రారంభమై నెల దాటింది. ఇప్పటికీ పశ్చిమాసియా సంక్షోభానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు, అమెరికా దాడుల్ని ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమై ఉన్న యూఎస్ బలగాలు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ‘‘భూతల దాడులకు’’ సిద్ధమవుతోంది.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి సుముఖంగా లేనప్పటికీ, అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. శనివారం నాడు యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్లు సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రాంతానికి చేరుకున్నారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. Also Read:Lenin : అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్ పై మాస్టర్ ప్లాన్..? ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన…
సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఇరువురి మధ్య సంభాషణ జరిగింది.
LPG: ఇరాన్ యుద్ధం భారత్ ఇంధన సంక్షోభాన్ని పెంచింది. ముఖ్యంగా ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, భారత్ లాంటి మిత్ర దేశాలకు హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. Read Also: Tollywood : నాకు దురంధర్ మ్యూజిక్ డైరెక్టరే కావాలంటున్న టాలీవుడ్ స్టార్ హీరో ఇదిలా…
PM Modi-Trump call: ఇరాన్ యుద్ధంపై ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో చర్చించారు. ఇరువురు నేతలు చర్చిస్తున్న సమయంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్లో బిలయనీర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. సాధారణంగా ఇరువురు దేశాధినేతలు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి కాల్లో కనిపించడం అసాధారణం. మంగళవారం అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీల మధ్య ఫోన్ కాల్లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది. Read Also: Akhil…
ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఓడల మార్గమైన హార్ముజ్ జలసంధి వద్ద ప్రస్తుతం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విమానం నుంచి తీసిన ఏరియల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సముద్రంలో చిన్న చిన్న బొమ్మల్లా వందలాది షిప్స్ ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని దాదాపుగా బ్లాకేడ్ చేసింది. ఫలితంగా మార్చి నెలలో కేవలం 100 ఓడలు మాత్రమే ఈ…
Iran War: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ తహతహలాడుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగేందుకు ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయనే నివేదికలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ చేతిలో పాకిస్తాన్ను అవమానం తప్పలేదు. పాకిస్తాన్కు వెళ్తున్న ఒక కంటైనర్ షిప్ను హార్ముజ్ జలసంధి దాటకుండా ఇరాన్ దళాలు నిలిపేశాయి. యూఏఈ షార్జా నుంచి కరాచీ వైపు వెళ్తున్న ఈ నౌకను నిలిపేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. Read…