SKLM MARPHING: మార్ఫింగ్ మాయ..
- రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ సాంకేతికత
- కొంత మంది ఆకతాయిలు మిస్ యూజ్ చేస్తున్నారు
- అశ్లీలాలకు, జుగుప్స కలిగించే వీడియోలకు వాడుతున్నారు
- విద్యార్థినుల ఫోటోలను ఏఐ టూల్స్ సాయంతో మార్ఫింగ్
- ఓ విద్యార్థినికి ఆ ఫోటోలు చూపించి బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SKLM MARPHING: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అక్రమాలకు కొంత మంది ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళంలో ఏఐ టూల్స్ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేశారు కొంత మంది విద్యార్థులు. దీంతో గురజాడ గాయత్రి కళాశాలలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? నిందితులను పోలీసులు పట్టుకున్నారా? కాలేజీ యాజమాన్యం వెర్షన్ ఏంటి?. AI సాంకేతిక పరిజ్ఞానం.. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లుగా ఫోటోలు.. వీడియోలు క్రియేట్ చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతోంది. కానీ దానిని కొంత మంది ఆకతాయిలు మిస్ యూజ్ చేస్తున్నారు. అశ్లీలాలకు, జుగుప్స కలిగించే వీడియోలకు వాటిని వాడుతున్నారు. శ్రీకాకుళంలోని మునసబుపేటలో ఉన్న గురజాడ గాయిత్రి కళాశాలలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ కాలేజీలో చాలా మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసిన అంశం కలకలం సృష్టించింది.
ఈ మధ్య కాలేజీలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా చాలా మంది విద్యార్థినీ విద్యార్థులు ఫోటోలు దిగారు. ఇది సర్వసాధారణంగా ఎక్కడైనా జరిగేదే. కానీ ఇక్కడే కొంత మంది విద్యార్థులు.. తమ కన్నింగ్ బ్రెయిన్ వాడారు. పలువురు విద్యార్థినుల ఫోటోలను ఏఐ టూల్స్ సాయంతో మార్ఫింగ్ చేశారు. అంతే కాదు ఓ విద్యార్థినికి ఆ ఫోటోలు చూపించి బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో ఒక్కసారిగా షాకయిన విద్యార్థిని.. ధైర్యంగా విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకుంది. తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. కానీ కాలేజీ యాజమాన్యం మాత్రం పరువు కోసం ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆయా విద్యార్థులుకు టీసీ ఇచ్చి చేతులు దులిపేసుకుంది.
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
అంతకు ముందు కాలేజీ యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టి.. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి ఏడాది చదవుతున్న సాయి, మధు, బాలు, హర్షవర్థన్తో పాటు బీఎస్సీ సీనియర్ విద్యార్థినిని కూడా బాధ్యులుగా గుర్తించారు. వీరి నుంచి 5 జీబీ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీరిలో నలుగురు జూనియర్లకు రెండు రోజుల క్రితం టీసీలు ఇచ్చి కాలేజీ నుంచి పంపించేశారు. విద్యార్ధినులందరూ కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చివరకు విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్లో సంబంధం ఉన్న విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం.. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ కోణాల్లో ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!