SKLM MARPHING: మార్ఫింగ్ మాయ..
- రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ సాంకేతికత
- కొంత మంది ఆకతాయిలు మిస్ యూజ్ చేస్తున్నారు
- అశ్లీలాలకు, జుగుప్స కలిగించే వీడియోలకు వాడుతున్నారు
- విద్యార్థినుల ఫోటోలను ఏఐ టూల్స్ సాయంతో మార్ఫింగ్
- ఓ విద్యార్థినికి ఆ ఫోటోలు చూపించి బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SKLM MARPHING: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అక్రమాలకు కొంత మంది ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళంలో ఏఐ టూల్స్ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేశారు కొంత మంది విద్యార్థులు. దీంతో గురజాడ గాయత్రి కళాశాలలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? నిందితులను పోలీసులు పట్టుకున్నారా? కాలేజీ యాజమాన్యం వెర్షన్ ఏంటి?. AI సాంకేతిక పరిజ్ఞానం.. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లుగా ఫోటోలు.. వీడియోలు క్రియేట్ చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతోంది. కానీ దానిని కొంత మంది ఆకతాయిలు మిస్ యూజ్ చేస్తున్నారు. అశ్లీలాలకు, జుగుప్స కలిగించే వీడియోలకు వాటిని వాడుతున్నారు. శ్రీకాకుళంలోని మునసబుపేటలో ఉన్న గురజాడ గాయిత్రి కళాశాలలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ కాలేజీలో చాలా మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసిన అంశం కలకలం సృష్టించింది.
ఈ మధ్య కాలేజీలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా చాలా మంది విద్యార్థినీ విద్యార్థులు ఫోటోలు దిగారు. ఇది సర్వసాధారణంగా ఎక్కడైనా జరిగేదే. కానీ ఇక్కడే కొంత మంది విద్యార్థులు.. తమ కన్నింగ్ బ్రెయిన్ వాడారు. పలువురు విద్యార్థినుల ఫోటోలను ఏఐ టూల్స్ సాయంతో మార్ఫింగ్ చేశారు. అంతే కాదు ఓ విద్యార్థినికి ఆ ఫోటోలు చూపించి బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో ఒక్కసారిగా షాకయిన విద్యార్థిని.. ధైర్యంగా విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకుంది. తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. కానీ కాలేజీ యాజమాన్యం మాత్రం పరువు కోసం ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆయా విద్యార్థులుకు టీసీ ఇచ్చి చేతులు దులిపేసుకుంది.
Also Read
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Pune Murder Twist: ప్రతీ సీనూ క్లైమాక్స్..కేతన్ అగర్వాల్ మరణంలో ట్విస్టుల మీద ట్విస్టులు!
- Tragedy: ఫోటోలకు పోజులిస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
అంతకు ముందు కాలేజీ యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టి.. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి ఏడాది చదవుతున్న సాయి, మధు, బాలు, హర్షవర్థన్తో పాటు బీఎస్సీ సీనియర్ విద్యార్థినిని కూడా బాధ్యులుగా గుర్తించారు. వీరి నుంచి 5 జీబీ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీరిలో నలుగురు జూనియర్లకు రెండు రోజుల క్రితం టీసీలు ఇచ్చి కాలేజీ నుంచి పంపించేశారు. విద్యార్ధినులందరూ కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చివరకు విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్లో సంబంధం ఉన్న విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం.. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ కోణాల్లో ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!