IndiGo: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరిగిన ఇండిగో టికెట్ ధరలు..
- ప్రయాణికులకు ఇండిగో షాక్..
- టికెట్లపై ‘‘ఫ్యూయల్ సర్చార్జ్’’..
- పెరుగనున్న టికెట్ ధరలు..
- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo: మధ్యప్రాచ్యంలోని ఇరాన్ యుద్ధ ప్రభావం దేశ విమానయాన రంగంపై పడింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో, టికెట్లపై ‘‘ఫ్యూయల్ సర్చార్జ్’’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు మార్చి 14 అర్థరాత్రి 12 నుంచి అమలులోకి వస్తాయని సంస్థ తెలిపింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తన టికెట్లపై అదనపు ఫ్యూయర్ సర్ఛార్జ్ విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ విడుదల చేసిన జెట్ ఫ్యూయల్ మానిటర్ ప్రకారం.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో విమాన ఇంధన ధరలు 85 శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. విమానయాన సంస్థల మొత్తం వ్యయాల్లో ఏటీఎఫ్ భాగమే ఎక్కువ కావడంతో, ఈ పెరుగుదల కంపెనీలపై పెను భారాన్ని చూపుతుంది. ప్రస్తుతం, ఇండిగో టికెట్ పై ప్రతీ ప్రయాణికుడు అదనపు ఫ్యూయల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
- Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
Read Also: Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?
కొత్త బుకింగ్స్పై ప్రతీ ప్రయాణికుడు సెక్టార్ల వారీగా అదనపు ఫ్యూయల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. భారత్లో దేశీయ విమానాలకు రూ. 425, ఇండిన్ సబ్ కాంటినెంట్ రూ. 425, మిడిల్ ఈస్ట్ రూ. 900, దక్షిణాసియా మరియు చైనా రూ. 1800, ఆఫ్రికా మరియు వెస్ట్ ఆసియా రూ. 1800, యూరప్ రూ. 2300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇంధన ధరల పెరుగుదల వల్ల టికెట్ ధరలను భారీగా పెంచాల్సి వస్తుందని, అయితే ప్రయాణికులపై అధిక భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఫ్యూయల్ సర్చార్జ్ విధించామని ఇండిగో తెలిపింది. అదనపు ఛార్జీల వల్ల ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతూ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మార్పులు చేస్తామని సంస్థ ప్రకటించింది.
తాజావార్తలు
-
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
-
Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
-
PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
-
Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
-
Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్న్యూస్..ఇండియాలో వర్షాలు..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!