IndiGo: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరిగిన ఇండిగో టికెట్ ధరలు..
- ప్రయాణికులకు ఇండిగో షాక్..
- టికెట్లపై ‘‘ఫ్యూయల్ సర్చార్జ్’’..
- పెరుగనున్న టికెట్ ధరలు..
- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo: మధ్యప్రాచ్యంలోని ఇరాన్ యుద్ధ ప్రభావం దేశ విమానయాన రంగంపై పడింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో, టికెట్లపై ‘‘ఫ్యూయల్ సర్చార్జ్’’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు మార్చి 14 అర్థరాత్రి 12 నుంచి అమలులోకి వస్తాయని సంస్థ తెలిపింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తన టికెట్లపై అదనపు ఫ్యూయర్ సర్ఛార్జ్ విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ విడుదల చేసిన జెట్ ఫ్యూయల్ మానిటర్ ప్రకారం.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో విమాన ఇంధన ధరలు 85 శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. విమానయాన సంస్థల మొత్తం వ్యయాల్లో ఏటీఎఫ్ భాగమే ఎక్కువ కావడంతో, ఈ పెరుగుదల కంపెనీలపై పెను భారాన్ని చూపుతుంది. ప్రస్తుతం, ఇండిగో టికెట్ పై ప్రతీ ప్రయాణికుడు అదనపు ఫ్యూయల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Read Also: Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?
కొత్త బుకింగ్స్పై ప్రతీ ప్రయాణికుడు సెక్టార్ల వారీగా అదనపు ఫ్యూయల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. భారత్లో దేశీయ విమానాలకు రూ. 425, ఇండిన్ సబ్ కాంటినెంట్ రూ. 425, మిడిల్ ఈస్ట్ రూ. 900, దక్షిణాసియా మరియు చైనా రూ. 1800, ఆఫ్రికా మరియు వెస్ట్ ఆసియా రూ. 1800, యూరప్ రూ. 2300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇంధన ధరల పెరుగుదల వల్ల టికెట్ ధరలను భారీగా పెంచాల్సి వస్తుందని, అయితే ప్రయాణికులపై అధిక భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఫ్యూయల్ సర్చార్జ్ విధించామని ఇండిగో తెలిపింది. అదనపు ఛార్జీల వల్ల ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతూ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మార్పులు చేస్తామని సంస్థ ప్రకటించింది.
తాజావార్తలు
-
Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
-
UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్లో అసలేం జరిగింది?
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!