PM Modi: మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాజ్యసభలో అన్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చల మార్గాన్ని అనుసరించాలని భారత్ సూచించింది. ఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలికంగా కొనసాగుతుందని ప్రధాని హెచ్చరించారు. ముఖ్యంగా ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరుక్కుపోయిన నౌకలు, అందులోని భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. Read Also: OnePlus Nord 6: వన్ ప్లస్ నార్డ్ 6.. 9000mAh బ్యాటరీ,…
గ్యాస్ సంక్షోభంతో కలత చెందుతున్న వినియోగదారులకు భారీ ఊరట లభించింది. భారత జెండా కలిగిన మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. అవి రాబోయే రెండు రోజుల్లో భారత తీరానికి చేరుకుంటాయని భావిస్తున్నారు. ఈ నౌకలు దేశానికి ఒక రోజుకు సరిపడా వంటగ్యాస్ను తీసుకువస్తున్నాయి. అంటే, భారతదేశంలో ఒక్క రోజులో వినియోగించే ఎల్పీజీ పరిమాణం, ఈ నౌకలలోని ఎల్పీజీ పరిమాణానికి సమానం. Also Read:IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య…
రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పర్షియన్ న్యూ ఇయర్ నౌరూజ్ సందర్భంగా ఇరాన్ నాయకత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాస్కో ఇరాన్కు “నమ్మకమైన స్నేహితుడు, విశ్వసనీయ భాగస్వామి”గా ఉందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల మధ్య ఈ సందేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పుతిన్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా హొస్సేనీ ఖమెనేయి, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్లకు నౌరూజ్ శుభాకాంక్షలు పంపారు. Also Read:Pawan…
బిన్ లాడెన్ను వేటాడిన మాజీ సీఐఏ చీఫ్ ట్రంప్కు హార్ముజ్ సలహామాజీ సీఐఏ డైరెక్టర్, రక్షణ మంత్రి లియన్ పనెట్టా, ఒసామా బిన్ లాడెన్ను చంపిన ఆపరేషన్ను పర్యవేక్షించిన వ్యక్తి, ప్రస్తుత ఇరాన్-అమెరికా సంఘర్షణలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లియన్ పనెట్టా ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రంప్ ఈ సమస్యకు ఏకైక బాధ్యుడని, ఇరాన్తో యుద్ధం ప్రారంభించిన తర్వాత హార్ముజ్ జలసంధిని…
Iran War: ఇరాన్ భారీ ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలో శత్రవుకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఈ చర్య ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ పనితీరును ప్రతిబింబిస్తుంది.
పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో గత కొన్ని రోజులుగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సముద్ర మార్గంలో రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇరాన్ పక్కన ఉండే ‘హార్ముజ్ జలసంధి’ సముద్ర మార్గం గుండా వెళ్లాలంటే ఓడలు భయపడుతున్నాయి. అయితే.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారతదేశానికి చెందిన రెండు పెద్ద గ్యాస్ నౌకలు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఏమిటా నౌకలు..? ఎక్కడున్నాయి..? భారతదేశానికి చెందిన ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ అనే రెండు భారీ నౌకలు…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరుగుతున్న ఉద్రిక్తతల మధ్య స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (హోర్ముజ్ జలసంధి) ను తిరిగి తెరవడానికి, రక్షించడానికి నాటో మిత్రదేశాలు, ఇతర మిత్రపక్షాల నుంచి సైనిక సహాయం (వార్షిప్లు పంపడం) కోరారు. కానీ చాలా దేశాలు (యూకే, ఆస్ట్రేలియా, జపాన్ వంటివి సహా) నిరాకరించాయి లేదా మద్దతు ఇవ్వలేదు. దీంతో ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాటోను “cowards” (పిరికివాళ్లు) అని, “paper tiger” అని విమర్శించారు. ముఖ్యంగా “We will remember…
ఎక్కడో జరుగుతున్న ఒక యుద్ధం.. మన మొబైల్ ఫోన్లలో నెట్ ఆగిపోవడానికి కారణమవుతుందా? హార్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచానికి చమురు ఆగిపోతుందని తెలుసు.. కానీ అదే మార్గం బ్లాక్ అవ్వడం కారణంగా ఇంటర్నెట్ లైన్లు కూడా కట్ అవుతాయా? వీడియో కాల్స్, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు.. ఇలా మన రోజువారీ జీవితం మొత్తం ఒక్కసారిగా నెమ్మదిస్తే? మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు ఒక కొత్త భయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం చమురు యుద్ధం మాత్రమే కాదని.. ప్రపంచాన్ని…
Donald Trump: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలపై ఆగ్రహంతో ఉన్నారు. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరిపించడానికి మిత్రదేశాలు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, ట్రంప్ పిలుపుకు ఏ ఒక్క మిత్రదేశం కూడా అనుకూలంగా లేదు.
Trump: ఇరాన్కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.