Srinu Vaitla: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవసరం లేదు. దూకుడు, వెంకీ, ఢీ లాంటి చిత్రాలు ఆయనను ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల కెరీర్ ఒడిదుడుకుల మధ్య కొట్టుకొంటున్న విషయం విదితమే.
Tollywood Director: ఒకప్పుడు అతనో స్టార్ డైరెక్టర్.. అతనితో సినిమా కోసం స్టార్ హీరోలు ఎగబడేవారు. అతను సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని నిర్మాతలు నమ్మేవారు.
హీరోగా రవితేజ, డైరెక్టర్ గా శ్రీను వైట్ల ఇద్దరూ ‘నీ కోసం’ సినిమాతోనే ప్రయాణం మొదలెట్టారు. ఆ పై వారి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు సైతం జనాన్ని అలరించాయి. అలా అలరించిన చిత్రాల్లో 15 ఏళ్ళ కిందట జనం ముందు నిలచిన ‘దుబాయ్ శీను’ కూడా చోటు సంపాదించింది. నయనతార నాయికగా నటించిన ‘దుబాయ్ శీను’ 2007 జూన్ 7న విడుదలై వినోదం పంచింది. కథలోకి తొంగి చూస్తే- దుబాయ్ వెళ్ళి కోట్లు సంపాదించేయాలని…
ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చారి పాత్రధారి బ్రహ్మానందం పలు మార్లు ఈ పదాలు పలికి, చేసిన కామెడీని మరచిపోలేరు. ఇప్పటికీ కొందరు సమయోచితంగా “ఇందులో మమ్మల్ని ఇన్ వాల్వ్…
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీను వైట్ల తండ్రి ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల తండ్రి పేరు వైట్ల కృష్ణారావు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందుల పాలెంలో నివసిస్తున్నారు ఆయన. శ్రీను వైట్ల మాత్రం ఫ్యామిలీతో సినిమాల నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్నారు. కాగా గత కొన్ని రోజులుగా…
(సెప్టెంబర్ 28న ‘ఆనందం’కు 20 ఏళ్ళు) ఆకాశ్ హీరోగా నటించిన చిత్రాలన్నిటిలోకి ది బెస్ట్ ఏది అంటే ‘ఆనందం’ అనే చెప్పాలి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ‘ఆనందం’ ప్రేమకథగా తెరకెక్కి జనాన్ని ఆకట్టుకుంది. 2001 సెప్టెంబర్ 28న ‘ఆనందం’ విడుదలయింది. యువతను విశేషంగా అలరించింది. ‘ఆనందం’ కథ ఏమిటంటే – కిరణ్, ఐశ్వర్య ఇరుగుపొరుగువారు. చిన్నప్పటి నుంచీ వారిద్దరికీ పడదు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాలేజీలోనూ తరచూ…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. రవితేజ తదుపరి యాక్షన్ డ్రామా “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరోవైపు “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంతో షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించబోతున్నాడు…