Srinu Vaitla: మళ్ళీ శ్రీను వైట్ల మ్యాజిక్ సాగేనా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
24th September is director Srinu White’s birthday: కామెడీతో కబడ్డీ ఆడేస్తూ, యాక్షన్ తో జనాన్ని ఆకట్టుకుంటూ, సెంటిమెంట్ తోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తూ పలు ఫీట్లు చేశారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం అంటే షడ్రుచోపేత భోజనంతో సమానం అనుకోవాల్సిందే! అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే రీతిలో శ్రీనువైట్ల తన చిత్రాలను తెరకెక్కించి అలరించేవారు. జయాపజయాలు దైవాధీనం అన్నట్టుగా ఆయన అనూహ్య విజయాలనూ చూశారు. కొన్ని పరాజయాలతోనూ పయనించారు. అయినా ఈ నాటికీ జనం శ్రీను వైట్ల సినిమా అంటే నవరసభరితంగా ఉంటుందని భావిస్తూనే ఉన్నారు. శ్రీను వైట్ల మాత్రం అదుగో ఇదుగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప మరో సినిమాతో మురిపించడం లేదు.
శ్రీను వైట్ల 1972 సెప్టెంబర్ 24న తూర్పు గోదావరి జిల్లా కందుల పాలెంలో జన్మించారు. కొందరు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన శ్రీను వైట్ల తొలుత రాజశేఖర్ హీరోగా `అపరిచితుడు` అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అయితే అనుకోని కారణాల వల్ల ‘అపరిచితుడు’ ప్రేక్షకులకు పరిచయం కాకుండానే పోయాడు. తరువాత రవితేజ హీరోగా `నీ కోసం` చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా విడుదల కోసం పలు పాట్లు పడ్డారు. ఉషాకిరణ్ సంస్థ `నీ కోసం`ను జనం ముందు నిలిపింది. దాంతో శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభ ఏమిటో జనానికి తెలిసింది. తరువాత ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన `ఆనందం`తో భలేగా ఆకట్టుకున్నారు శ్రీను వైట్ల. రవితేజ `వెంకీ`లో శ్రీను వైట్ల కామెడీతో జనం కడుపులు చెక్కలు చేశారు. యాక్షన్, థ్రిల్స్ తోనూ మురిపించారు.
Also Read
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
చిరంజీవితో శ్రీను వైట్ల తెరకెక్కించిన `అందరివాడు` ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. శ్రీను పని అయిపోయిందని చాలామంది భావించారు. ఆ సమయంలో `ఢీ`తో బాక్సాఫీస్ ను ఢీడిక్కిలాడించారు. ఆ తరువాత `రెడీ`తో రామ్ కు మరపురాని విజయం అందించారు. “దుబాయ్ శీను, నమో వెంకటేశ, కింగ్“ చిత్రాలలో శ్రీను పూయించిన నవ్వులను ఇప్పటికీ జనం ఏరుకుంటూనే ఉన్నారు. మహేశ్ బాబుతో శ్రీను వైట్ల తెరకెక్కించిన తొలి చిత్రం `దూకుడు` బాక్సాఫీస్ వద్ద నిజంగానే దూకుడు చూపింది. ఆ సినిమా తరువాత శ్రీను వైట్ల రేంజ్ మారిపోయింది. ఆ తరువాత శ్రీను దర్శకత్వంలో “బాద్ షా, ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ“ రూపొందినా, మళ్ళీ `దూకుడు` నాటి మ్యాజిక్ సాగలేదు. ‘ఢీ’కి సీక్వెల్ రూపొందిస్తామని కొన్నేళ్ళ క్రితం ప్రకటించారు. ఇప్పటి వరకు అది రూపు దాల్చలేదు. 2018 నవంబర్ 16న శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోని’ విడుదలయింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా శ్రీను వైట్ల చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. ఆయన నుండి మరో నవ్వుల తేరు వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?