ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో చెలరేగడంతో లంకను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 302 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్కు బెర్త్ ఖాయం చేసుకుంది.
వన్డే ప్రపంచకప్-2023లో భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. అ మెగా టోర్నమెంట్ లో భాగంగా నేడు వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఈ మ్యాచ్లో 5 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 18 పరుగుల మాత్రమే ఇచ్చి కీలకమైన 5 వికెట్లు పడగొట్టాడు.
శ్రీలంక ముందు టీమిండియా 358 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరును నమోదు చేసింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ను తిలకించేందుకు పలువురు ప్రముఖులు స్టేడియంకు వచ్చారు. అందులో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఉంది. ఇప్పటికే టీమిండియా ఆడిన పలు మ్యాచ్లకు ఎంకరేజ్ చేయగా.. మరోసారి తళుక్కుమంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెమెరామెన్ సారాను చాలాసార్లు చూపెట్టాడు. ఎందుకంటే శుభమాన్ గిల్ క్రీజులో ఉన్నాడు కాబట్టి. ఇంతకుముందు గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తెగ ఎంకరేజ్ చేసిన సారా టెండూల్కర్..…
2023 ప్రపంచకప్లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు 168వ మ్యాచ్. ఇప్పటి వరకు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో టీమిండియా 98 మ్యాచ్ల్లో గెలుపొందగా.. శ్రీలంక 57 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా, 11 మ్యాచ్లు ఫలితం తేలలేదు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఇక.. వికెట్ల పరంగా ముత్తయ్య…
పంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి ఓవర్లనే మొదటి వికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్ స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 60 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్(22), విరాట్ కోహ్లీ(28) ఉన్నారు.
గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా తర్వాతి మ్యాచ్లో జట్టులో చేరనున్నాడు. నవంబర్ 2న ముంబైలో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ వరకు జట్టులోకి వస్తాడు కానీ.. మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. సోమవారం కొలంబోలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అబేశేఖరను క్రికెటర్స్ ముద్దుగా "అంకుల్ పెర్సీ" అని పిలుచుకునేవారు.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పూణే వేదికగా జరిగిన అఫ్గానిస్తాన్- శ్రీలంక మ్యాచ్ లో మరో సంచలన విజయం నమోదు చేసుకుంది. శ్రీలంకను 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఓడించింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా పూణే వేదికగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది.