Sri Lankan Navy: 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక నావికాదళం 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. అంతేకాకుండా.. దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడటం కోసం వాడే వారి పడవలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర జాఫ్నా ద్వీపంలోని కరైనగర్ తీరంలో శనివారం మత్స్యకారులను అరెస్టు చేసి, వారి మూడు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి చర్యల నిమిత్తం ఈ మత్స్యకారులను కంకేసంతురై ఓడరేవుకు తరలించారు.
Read Also: PM Modi: పొంగల్ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
భారతదేశం-శ్రీలంక మధ్య సంబంధాలలో మత్స్యకారుల సమస్య వివాదాస్పద అంశంగా మారింది. ఈ క్రమంలో.. శ్రీలంక నావికాదళ సిబ్బంది పాక్ జలసంధిలో భారతీయ మత్స్యకారులపై కాల్పులు జరిపారు. అంతేకాకుండా.. శ్రీలంక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అనేక సంఘటనలలో వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ నుండి దూరంగా ఉండండి..!
పాక్ జలసంధి అనేది తమిళనాడును శ్రీలంక నుండి వేరుచేసే నీటి ప్రాంతం. ఇందులో రెండు దేశాల మత్స్యకారులు చేపల వేటకు వెళతారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి శ్రీలంక జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలతో భారత జాలరులను శ్రీలంక అధికారులు అరెస్టు చేసిన సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ద్వీప దేశం యొక్క నావికాదళం 2023లో శ్రీలంక జలాల్లో వేటాడటం కోసం 240 మంది భారతీయ మత్స్యకారులతో పాటు 35 పడవలను స్వాధీనం చేసుకుంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!