Free Tourist Visas: భారత్తో పాటు 6 దేశాలకు శ్రీలంక ‘ఉచిత టూరిస్ట్ వీసాలు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Tourist Visas: శ్రీలంక దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజంపై ఆ దేశం మరింత దృష్టి పెట్టింది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం టూరిస్టులను ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. భారత్ నుంచే శ్రీలంకకు ఎక్కువ పర్యాటకులు వెళ్తున్న క్రమంలో మన దేశానికి చెందిన పౌరులకు ‘ఫ్రీ టూరిస్ట్ వీసా’లను మంజూరు చేయనున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషషన్ శాఖ కొలంబోలో ప్రకటించింది.
2019 ఈస్టర్ పేలుళ్లు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గింది. దీంతో ప్రధానంగా ఈ రంగంపైనే ఆధారపడిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అయితే తాజాగా భారత్తో పాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలను జారీ చేయాలని అక్టోబర్ నెలలో ఆ దేశ క్యాబినెట్ల నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అమలు చేయనుంది.
Also Read
Read Also: Uttarakhand Tunnel Operation: ఇంకా 2 మీటర్ల దూరమే.. రాత్రంతా కొనసాగనున్న డిగ్గింగ్ పనులు?
మొదటి 30 రోజుల పాటు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్ట్ మార్చి 31, 2024 నుంచి అమలులోకి వస్తుందని శ్రీలంక ప్రకటించింది. ప్రయాణికుల రాక తర్వాత డ్యూయల్ ఎంట్రీ స్టేటస్ ఇవ్వబడుతుంది. 30 రోజుల వీసా వాలిడిటీతో ద్వీప దేశంలో 30 రోజులు స్టే చేయవచ్చు. శ్రీలంకకు భారత్ టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. అక్టోబర్ 2023లో ఆ దేశానికి 28,000 భారత టూరిస్టులు వెళ్లారు. ఇండియా టాప్ పొజిషన్లో ఉంటే.. 10,000 మందితో రష్యా రెండో స్థానంలో నిలిచింది. ఈ తర్వాత యూకే ఉంది.
2019లో ఈస్టర్ బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లింది. ఈ ఘటనలో 270 మంది మరణించారు. ఇందులో 11 మంది భారతీయులు ఉన్నారు. 500 మంది గాయపడ్డారు.ఆ తర్వాత నుంచి క్రమంగా పర్యాటకుల సంఖ్య తగ్గింది. గతేడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆహారం, మెడిసిన్స్, ఇంధనం ఇలా అన్నింటికి ఇబ్బందులు పడింది.
తాజావార్తలు
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!