Pakistan: విదేశీ మహిళలపై పాక్ ఉప ప్రధాని మనవడి గ్యాంగ్ రేప్.
- విదేశీ మహిళలపై పాకిస్తాన్లో అత్యాచారం..
- నిందితుల్లో ఒకరు పాక్ ఉప ప్రధాని మనవడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇద్దరు విదేశీ మహిళల్ని నమ్మించి, పాకిస్తాన్ వచ్చిన తర్వాత కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మనవడు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడితో సహా నలుగురు అనుమానితుల్ని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన నిందితులను మహమ్మద్ రజా దార్, హసన్ రజా, సికందర్ ఖాన్, మరియు సాజిద్ అలీగా గుర్తించారు. లాహోర్ కోర్టు శుక్రవారం నలుగురు నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
ప్రధాన నిందితుడు మహమ్మద్ రజా దార్, ఇతను పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ బంధువుని, వరసకు మనవడు అవుతాడని సమాచారం. ఉప ప్రధానితో ఈ కేసు ముడిపడి ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాల్లలో ఒకరు నెదర్లాండ్స్, మరొకరు వెనిజులాకు చెందినవారు. జూన్ 29న లాహోర్లో వీరిద్దరినీ అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
బాధితుల్లో ఒకరి తండ్రి స్పెయిన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి తన కుమార్తెకు ప్రమాదం గురించి తెలియజేయడంతో జూన్ 29న లాహోర్లో వీరిద్దరినీ అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు స్పందించి ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించారు. లాహోర్ పోలీసులు గురువారం ఐదుగురు నిందితులపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులలో నలుగురిని అరెస్టు చేయగా, ఐదవ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇతని కోసం దాడులు చేస్తున్నారు.
ఇద్దరు మహిళలు అక్టోబర్ 2025లో సింగపూర్లో ముహమ్మద్ రజా దార్ను కలిశారు. వీరిద్దరిని పాకిస్తాన్ రమ్మని ఆహ్వానించారు. ఇద్దరు మహిళల్ని క్రిప్టో కరెన్సీ వ్యాపారం కోసమని నమ్మంచి పాకిస్తాన్ రప్పించారు. రజా దార్ ఇద్దర మహిళలకు బిజినెస్ వీసాలు ఏర్పాటు చేశాడు. జూన్ 29న ఇద్దర కూడా లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి కిడ్నాప్ చేసి, ఒక గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడుదల చేయడానికి నిందితులు డబ్బుల్ని డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. కోర్టు విచారణ సమయంలో రజా దార్ను ప్రధాన నిందితుడిగా ఇద్దరు మహిళలు గుర్తించారు.
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?