కుటుంబసభ్యులతో కలిసి అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సి వెళ్లి వేడుక విషాదంగా మారింది. పెళ్లికి ఆతిథ్యం ఇస్తున్న ఓ రెస్టారెంట్ ముందు గొడవ.. తీవ్రంగా మారి నలుగురు వ్యక్తుల మృతికి దారితీసింది.
స్పెయిన్లో మంకీపాక్స్ కారణంగా తొలి మరణం సంభవించిన 24 గంటల్లోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. యూరప్లోనే ఇది రెండవ మరణంగా నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలో మంకీపాక్స్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. ఆ దేశంలో ఇప్పటి వరకు 4298 మంది వ్యాధి బారిన పడ్డారు.
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ సింగర్ షకీరా ఆదాయ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్షకు గురయ్యే అవకాశాలున్నాయి. 2012 - 2014 మధ్యకాలంలో సంపాదించిన ఆదాయానికి సంబంధించి 14.5 మిలియన్ యూరోల పన్నులు చెల్లించడంలో విఫలమైనందున 2018లో స్పానిష్ ప్రాసిక్యూటర్లు ఆమెపై అభియోగాలు మోపారు.
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మందవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ , రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందం…
పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినపుడు రిజర్వాయర్ కింద ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నష్టపరిహారం ఇస్తుంటారు. ఏ దేశంలో తీసుకున్నా రిజర్వాయర్ నిర్మాణం జరిగే సమయంలో గ్రామాల్లోని ప్రజలను తరలిస్తుంటారు. స్పెయిన్లో 1990 దశకంలో ఆల్టో లిండోసో అనే రిజర్వాయర్ను నిర్మించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం అసెరెడో గ్రామంలోని ప్రజలను తరలించారు. 1992లో తరలింపు పూర్తయింది. రిజర్వాయర్ లోకి నీటిని మళ్లించడంతో అసెరెడో గ్రామం పూర్తిగా…
అగ్ని పర్వతాలు రెండు రకాలు ఉంటాయి. కొన్ని నాన్ యాక్టీవ్గా ఉంటే కొన్ని యాక్టీవ్గా ఉంటాయి. యాక్టీవ్గా ఉండే అగ్నిపర్వతాలు నిత్యం వేడిని వెదజల్లుతుంటాయి. అవి ఎప్పుడు బద్దలవుతాయో చెప్పలేం. ఆ పర్వతాల వద్దకు వెళ్లాలి అంటే ధైర్యం ఉండాలి. అలాంటిది ఆ పర్వతంపై రెస్టారెంట్ ఓపెన్ చేసి, అగ్నిపర్వతం నుంచి వెలువడే వేడితోనే వంట చేస్తే ఇంకెలా ఉంటుంది. కష్టమర్ల సంగతి పక్కనపెడితే అందులో పనిచేసేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి. ఇలాంటి రెస్టారెంట్ ఒకటి స్పెయిన్లోని…
భార్య కలను నెరవేర్చేందుకు ఓ వ్యక్తి ఏకంగా రూ. 5 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉండే స్పెయిన్కు చెందిన టెర్రి ఎడ్గెల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి సెలవుల్లో వెకేషన్ కోసం ఓ అందమైన ఇల్లును కొనుగోలు చేయాలని అనుకున్నడు. అయితే, ఆయన భార్యకు కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ సమీపంలోని 200 ఏళ్లనాటి కోట లాంటి ఇల్లు అంటే ఇష్టమని, ఒక్కసారైనా ఆ ఇంట్లో నివశించాలని అనుకుంది.…
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్లు వేగంగా పెరుగుతున్నవేళ అనేక దేశాల్లో ఐదు రోజుల పనివేళలను నాలుగు రోజులకు కుదిస్తూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 2020 నుంచి ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో వర్క్ఫ్రమ్ హోమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించేందుకు వివిధ దేశాలు సిద్ధమయ్యాయి. రోజుకు పనివేళలను పెంచి, పని దినాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాయి. Read: లైవ్: పులివెందుల…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సర్జరీ జరిగింది… ప్రస్తుతం ఆయన దుబాయ్లో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, మహేష్ ఆరోగ్యంపై గత కొంతకాలంగో సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది… మోకాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్తారని ప్రచారం సాగింది.. తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ సమయంలో.. మహేష్ మోకాలికి చిన్న గాయం అయినట్టుగా తెలుస్తోంది.. తీవ్రమైన నొప్పితో బాధపడుతోన్న మహేష్.. వైద్యులను సంప్రదించగా.. సర్జరీ అవసరమని…