రాజస్థాన్లో ఓ అద్భుతం జరిగింది. రెండుతలలో ఓ వింత గేదే జన్మించింది. రెండు తలల, నాలుగు కాళ్లు ఉన్న ఇలాంటి గేదెలు సాధారణంగా పుట్టిన కాసేపటికి మరణిస్తుంటాయి. కానీ, ఈ గేదె మాత్రం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు పశువైద్యులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యంతో ఉండటంతో పాటుగా ఆహారం రెండు తలలకు ఉన్న నోటి నుంచి తీసుకుంటుందని దాని యజమానులు చెబుతున్నారు. రెండు తలలతో జన్మించిన గేదె పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆహారం కూడా తీసుకుంటూ ఉండటంతో…
సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు వార్త ఏదో.. వైరల్ ఏదో తెలియని పరిస్థితి… అయితే, సోషల్మీడియాలో నకిలీ వార్తల ప్రచారంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సోషల్మీడియా, వెబ్ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా…
కొన్ని సార్లు జరిగే విషయాలను ఎలా నమ్మాలో అర్థం కాదు. కళ్ల ముందు జరుగుతున్నా… అది నిజమా కాదా… నిజమైతే ఎలా నిజమైంది అనే బోలెడు సందేహాలు వస్తుంటాయి. ఎక్కడైనా ఒక రైలు ఒకే వేగంతో వెళ్తుంది. కుడివైపున ఒకవేగంతో, ఎడమ వైపున మరోక వేగంతో వెళ్లదు. అది సాధ్యం కాదు కూడా. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం అదేలా సాద్యం అయింది అని నోరెళ్ల బెట్టక తప్పదు. వీడియో చూసిన వారు సైతం అది…
ఫొటో పర్ఫెక్ట్గా వస్తుందని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇక జంతువులు, పక్షులకు సంబంధించిన ఫొటోలను తీసే ఫొటోగ్రాఫర్లు ఖచ్చితమైన ఫొటోలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కొన్ని మాత్రమే అద్భుతం అనిపించే ఫొటోలను తీయగలుగుతారు. అలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటి. గద్ద ఒక చిన్న కొమ్మను పట్టుకొని వెళ్తుండగా, ఆ కొమ్మ వెనుక భాగంలో మరో నల్లని పక్షి కూడా కొమ్మను పట్టుకొని ఎగురుతున్నది. చిన్న చిన్న పక్షులు కనిపిస్తే వాటిని అమాంతంగా చంపేసి తినేస్తుంటాయి గద్దలు. అయితే,…
అడవికి రాజు సింహం. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. సింహానికి ఆకలేస్తేనే వేటాడుతుంది తప్పించి పులి, ఇతర కౄరమృగాల మాదిరిగా వేటాడి ఆహారాన్ని దాచుకోదు. అందుకే సింహం ఆకలిగా ఉన్నప్పుడు దానికి ఎదురుగా వెళ్లాలి అంటే భయపడే జంతువులు, కడుపు నిండిన తరువాత సింహం పక్కకు వెళ్లి నిలబడుతుంటాయి. అంతెందుకు సింహంతో కలిసి పక్కపక్కనే నిలబడి నీళ్లు తాగుతుంటాయి. ఇలానే, ఓ సింహం, దానిపక్కనే జీబ్రా నిలబడి నీళ్లు తాగుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఇంకేముంది…
ప్రపంచంలో ఎక్కువ మంది పిజ్జాలు తింటుంటారు. ప్రతిరోజూ కోట్లాది పిజ్జాలను ప్రజలు ఆర్డర్ చేస్తుంటారు. భూమి మీద ఎలా ఉన్నా, అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే, అక్కడ వారు వీలైనంత తక్కువగా ఆహారం తీసుకోవాలి. భారరహిత స్థితిలో ఉంటారు. పైగా అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నింటిని పక్కన పెట్టి భూమిపై ఉంటే ఎలాగైతే పార్టీ చేసుకుంటారో అదే విధంగా అంతరిక్ష కేంద్రంలో కూడా పిజ్జా పార్టీ…
కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వేగంగా కేసులు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పని సరి అని చెబుతున్నా, ప్రజలు ఆ మాటలు నెత్తికెక్కించుకోవడం లేదు. నాయకులే మాస్కులు పక్కన పెట్టి సభలు, సమావేశాలు, యాత్రలు చేస్తున్నారు. రాజు చూపిన బాటలోనే కదా ప్రజలు నడిచేది. అందుకే ప్రజలు కూడా అలానే చేస్తున్నారు. అయితే, మనుషుల కంటే తానే బెటర్ అని చెప్పకనే చెప్పింది…
ఇందిరాపార్క్ లో ఉదయం, సాయత్రం సమయాల్లో పెద్ద సంఖ్యలో నగరవాసులు వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. అయితే, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు సామాన్యప్రజలకు ప్రవేశం ఉంటుంది. ఇందిరా పార్క్కు ఎక్కువగా ప్రేమ జంటలు వస్తుంటాయి. అయితే, గత కొంతకాలంగా ఈ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుండటంతో పార్క్ యాజమాన్యం గేటు ముందు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఈ ఫ్లెక్సీపై…
ఇప్పటి వరకు మనం డ్రోన్ కెమెరా ద్వారా వీడియో షూటింగ్ చూసి ఉంటారు. పారాచూట్లో వెళ్తూ షూటింగ్ చేయడం చూసుంటారు. కాని, చిలుక ఎగురుతూ వీడియో తీయడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. చిలుక మాట్లాడుతుందని తెలుసుగాని, ఇలా వీడియోను షూట్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓ వ్యక్తి తన మొబైల్ను చూసుకుంటుండగా చిలుక అమాంతంగా ఆ మొబైల్ ఫోన్ను ఎత్తుకు పోయింది. అయితే ముక్కుకు ఫోన్ను కరుచుకుపోవడంతో వీడియో మోడ్ ఆన్ అయింది. అంతే…