మీరు కూడా ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ప్రణాళికను కలిగి ఉన్నారా..? యాత్ర కోసం కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈనెల 29 నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. పవిత్ర అమర్నాథ్ యాత్ర ను జూలై 1 నుంచి ప్రారంభించనున్నారు. యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది.
Heavy snowfall in America : అమెరికాలో మంచు భారీగా కురుస్తుంది. న్యూయార్క్తోపాటు పలు రాష్ట్రాల్లో పెద్దగా మంచు పడుతుంది. పశ్చిమ న్యూయార్క్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రస్తుతం బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ 2022 జరుగుతున్నది. శీతాకాలంలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ కోసం మంచు చాలా అవసరం అవుతుంది. సహజసిద్ధంగా మంచు ఉన్న ప్రాంతాల్లోనే వింటర్ ఒలింపిక్స్ను నిర్వహించాలి అంటే సాధ్యం కాదు. సహజసిద్ధంగా ఆ ప్రాంతంలో మంచు ఉన్నప్పటికీ క్రీడల నిర్వహణకు ఏ మాత్రం సరిపోదు. దీనికోసమే కృత్రిమంగా మంచును సృష్టిస్తుంటారు. 1980 దశకం నుంచి వింటర్ ఒలింపిక్స్ కోసం కొంతమేర మంచుకు కృత్రిమంగా సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో రష్యాలోని సోచీలో నిర్వహించిన వింటర్…
దృవప్రాంతాల్లోని మంచు గత దశాబ్దకాలంగా విపరీతంగా కరుగుతున్నది. ముఖ్యంగా గ్రీన్లాండ్, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు భారీగా కరుగుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. కర్భర ఉద్గార వాయువులు భారీ ఎత్తున విడుదల అవుతుండటంతో భూతాపం పెరిగిపోతున్నది. ఫలితంగా మంచు కరుగుతున్నది. గ్రీన్లాండ్లోని మంచుఫలకాల్లోని అడుగుభాగంలోని మంచు కరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి గ్రీన్ లాండ్ లోని మంచు మొత్తం కరిగిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్భన వాయువులను నియంత్రించేందుకు…
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. దీనిని ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పర్వతారోహకులు అధిరోహిస్తుంటారు. చాలా మంది ఈ మంచుపర్వతం సానువులను సందర్శిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఈ మంచుశిఖరంపై శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2వేల సంవత్సరాలలో ఏర్పడిన మంచు కేవలం 25 ఏళ్లలో కరిగిపోయింది. మంచు ఏర్పడటానికి పట్టిన సమయం కన్నా 80 రెట్లు వేగంగా మంచు కరిగిపోతున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబందించిన విషయాలను నేచర్ క్లైమేట్ జర్నల్ లో పేర్కొన్నారు.…
సాధారణంగా రష్యాలాంటి శీతల దేశాల్లో మంచు కురవడం సహజమే. మంచు అంటేనే తెల్లగా ఉంటుంది. కానీ, ఆ ప్రాంతంలో కురిసే మంచుమాత్రం నల్లగా ఉంటుందట. దీనిక కారణం లేకపోలేదు. మంచు విపరీతంగా కురిసే ఓంసుచన్ అనే ప్రాంతంలో ప్రజలకు వేడిని అందించేందుకు బొగ్గుతో నడిచే ఓ ప్లాంట్ను నిర్మించారు. ఇక్కడ సుమారు నాలుగువేల మందికి ఆ బొగ్గుఆధారిత ప్లాంట్ ద్వారా వేడి లభిస్తుంది. బొగ్గు కాల్చేసమయంలో వెలువడే పొగకారణంగా ఆ ప్రాంతంలో నిత్యం నల్లని దుమ్ముపేరుకుపోయి కనిపిస్తున్నది.…
ప్రస్తుతం అమెరికాలో మంచు భీభత్సం సృష్టిస్తోంది. మంచు తుపాన్ కారణంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైలు పట్టాలపై మంచు పేరుకుపోవడంతో అనేక రైళ్లు రద్దయ్యాయి. అయితే, చికాగో రైల్వే అధికారులు దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలను కనిపెట్టారు. మంచుకారణంగా రైలు పట్టాలు కుంచించుకుపోయి రైళ్ల రాకపోకలు ఇబ్బందులు కలుగుతుండటంతో రైళ్ల పట్టాలపై మంటలను ఏర్పాటు చేశారు. దీంతో పట్టాలు వెచ్చగా మారి రైళ్ల రాకపోకలకు అనువుగా మారుతున్నాయి. అయితే, ఇవి…
దేశ రక్షణే వారికి ప్రాణం. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరీ సరిహద్దుల్ని ఉగ్రమూకల నుంచి కాపాడుతున్నారు. కాశ్మీర్ బోర్డర్ లో తీవ్రంగా మంచు తుఫాను కురుస్తోంది. తన ప్రాణాలకు తెగించి మరీ గస్తీ కాస్తున్నారు భారత జవాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శత్రువుల కంటే ఈ మంచే పెద్ద శత్రువుగా విరుచుకుపడుతోంది. అయినా అలుపెరుగక, దేశ రక్షణకు అంకితం అవుతున్న ఇలాంటి భరత మాత ముద్దుబిడ్డలకు ఎన్టీవీ సలాం చేస్తోంది.…
ప్రపంచంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. చలి తీవ్రత ఉండే ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, ధృవప్రాంతాల్లోని మంచు ఫలకాలు వేడి గాలులకు కరిగిపోతున్నాయి. ఫలితంగా సముద్రంలోకి నీరు అధికంగా చేరుతున్నది. ఇక గ్రీన్లాండ్లోని మంచు వేగంగా కరుగుతుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో కరిగిన మంచు అమెరికా రాష్ట్రంలోని ఫ్లోరిడాను 2 అంగుళాల నీటిలో ముంచేయ్యగలదని పర్యావరణ…