Beijing Olympics: ఆ మంచు కోసం చైనా ఎంత ఖర్చు చేసిందో తెలుసా…!!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ 2022 జరుగుతున్నది. శీతాకాలంలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ కోసం మంచు చాలా అవసరం అవుతుంది. సహజసిద్ధంగా మంచు ఉన్న ప్రాంతాల్లోనే వింటర్ ఒలింపిక్స్ను నిర్వహించాలి అంటే సాధ్యం కాదు. సహజసిద్ధంగా ఆ ప్రాంతంలో మంచు ఉన్నప్పటికీ క్రీడల నిర్వహణకు ఏ మాత్రం సరిపోదు. దీనికోసమే కృత్రిమంగా మంచును సృష్టిస్తుంటారు. 1980 దశకం నుంచి వింటర్ ఒలింపిక్స్ కోసం కొంతమేర మంచుకు కృత్రిమంగా సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో రష్యాలోని సోచీలో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్కోసం 80 శాతం కృత్రిమ మంచును వినియోగించగా, దక్షిణకొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ కోసం 98శాతం కృత్రిమ మంచును వినియోగించారు. అయితే, బీజింగ్ లో జరుగుతున్న ఒలింపిక్స్ కోసం 100 శాతం కృత్రిమ మంచును వినయోగించారు. ఇటలీకి చెందిన టెక్నోఆల్సిన్ కంపెనీకి కాంట్రాక్ట్ పనులను అప్పగించారు. బీజింగ్ ఒలింపిక్స్ కోసం ఇటలీకి చెందిన టెక్నో ఆల్సిన్స్ కంపెనీ 2018 నుంచి పనులను ప్రారంభించింది. ఒలింపిక్స్ క్రీడల కోసం కృత్రిమ మంచును తయారు చేసేందుకు సుమారు 49 మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించారు.
Read: Birds Man: పక్షుల కోసం 2.5 లక్షల గూళ్లను తయారు చేశాడు..
Also Read
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
- IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
అంటే ఈ నీటితో సుమారు 10 కోట్ల మందికి కొన్ని రోజులపాటు తాగునీరు అందించవచ్చు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో 8 లక్షల చదరపు మీటర్లలో క్రీడలను నిర్వహించేందుకు 12 లక్షల క్యూబిక్ మీటర్ల మంచు అవసరం అవుతుందని గుర్తించారు. 272 ప్రొఫెల్లర్ డ్రివెన్ ఫ్యాన్ గన్లు, 82 లాన్స్ స్టైల్ గన్లు వినియోగించి ఈ మంచును తయారు చేశారు. ఈ కృత్రిమ మంచు తయారీ కోసమే చైనా ఏకంగా 60 మిలియన్ డాలర్లను ఖర్చుచేసింది. బీజింగ్ ఒలింపిక్స్ కోసం 49 మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించడంతో బీజింగ్లో నీటి కొరత ఏర్పడింది. ఈ నగరంలో నివశిస్తున్న 2.1 కోట్ల మంది ప్రజలు తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు, మియూన్ రిజర్వాయర్ నుంచి నీటిని పెద్ద ఎత్తున మళ్లించడంతో సాగునీటి కొరత ఏర్పడింది. సాగునీటి కొరత ఏర్పడంతో రైతులు వ్యవసాయాన్ని పక్కన పెట్టి పనుల కోసం వలస వెళ్లారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!