కర్ణాటక (Karnataka Congress) రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హీటెక్కాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం ఆరోపించింది.
కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ట్ర హైకోర్టు (Karnataka High Court) ఝలక్ ఇచ్చింది. ఓ కేసులో ఆయనకు రూ.10 వేలు జరిమానా విధించింది.
పన్నుల బదలాయింపు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. నాలుగేళ్లలో 45 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని అన్నారు.
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్కెరె ఆంజనేయ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. అంతేకాకుండా.. అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లి “బీజేపీ రాముడిని” ఎందుకు పూజించాలని ప్రశ్నించారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా సిద్ధరామయ్యను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించగా ఆంజనేయ మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్యే మా రాముడు అని అన్నారు. అలాంటప్పుడు అయోధ్యకు వెళ్లి ఆ రాముని పూజించడం ఎందుకు? అని ప్రశ్నించారు. అయోధ్య రాముడు…
కన్నడ అనుకూల సంస్థలు సైన్బోర్డ్లు, నేమ్ప్లేట్లు, ప్రకటనలపై కన్నడ భాషను ప్రదర్శించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకస్మికంగా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. సైన్బోర్డ్లో 60 శాతం కన్నడలో ఉండాలని ఆయన తెలిపారు.
Siddaramaiah: కర్ణాటకలోని హంపిలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. అక్కడకు వచ్చిన తన అభిమానులను తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ అలరించారు.
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లోని బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట కాళ్ల వరకు మెట్రో రైలు సేవలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
2024 లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అక్కడి ప్రభుత్వంలో మరో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఐదుగురిని ఉపముఖ్యమంత్రులను చేసే విషయమై చర్చిస్తున్నామని రాయరెడ్డి తెలిపారు.
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీఎం మోడీపై మరో సారి విరుచుకుపడ్డారు. 14 మంది మీడియా యాంకర్ల వద్దకు తమ ప్రతినిధులను పంపకూడదని ప్రతిపక్ష కూటమి 'ఇండియా'లో చేరిన పార్టీలు నిర్ణయించాయి.