కర్ణాటకలో పెరుగుతున్న డెంగ్యూ కేసుల దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.
Siddaramaiah: సనాతన ధర్మపై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఉదయనిధిపై విమర్శలు చేస్తోంది. ఈ వివాదం ముగియకముందే మరో వివాదానికి తెరలేపారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేరళలోని హిందూ దేవాలయలంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గృహలక్ష్మి యోజన ద్వారా మహిళలకు బహుమతులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గృహలక్ష్మి యోజనను ప్రారంభించనుంది.
ఉడిపి కాలేజీ కేసుకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ట్వీట్ చేసినందుకు గానూ బీజేపీ కార్యకర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి, ముఖ్యమంత్రి పదవులకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలోని అధికార పార్టీలో కలవరం మొదలైంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వరుణ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జూలై 28న విచారణ జరుపుతామని కర్ణాటక హైకోర్టు తెలిపింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య షాక్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్కు అనుబంధమైన జనసేవా ట్రస్టుకు అప్పటి బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంది. అయితే, వాస్తవానికి భూమి ఇస్తామని అప్పట్లో బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి, కొంత ప్రాసెస్ చేసింది. అయితే తాజాగా భూమి ఇవ్వడం కుదరదని సిద్ధరామయ్య సర్కార్ తేల్చి చెప్పింది.
కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు కీలకమైనవి. అందులో ఒకటే.. అన్నభాగ్య పథకం.. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రతినెలా 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకం.. ప్రస్తుతం ఈ స్కీమ్ ఆరంభమైంది. ఇవాళ ( సోమవారం) సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఈ పథకాన్ని లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఈ పథకంలో సిద్ధరామయ్య సర్కార్ చిన్న…
కర్ణాటక ప్రభుత్వం పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, 'అన్న భాగ్య' పథకం కింద ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు 5 కిలోల అదనపు బియ్యం అందించడానికి బదులుగా కిలోకు రూ.34 చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
DK Shivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రాజెక్టును కొనసాగించడానికి భయపడ్డాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వంలో దుమారాన్ని రేపుతున్నాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.