Bangalore Metro: బెంగళూరు మెట్రోలో 2 కొత్త సెక్షన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangalore Metro: బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లోని బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట కాళ్ల వరకు మెట్రో రైలు సేవలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.”బెంగళూరు మెట్రో రైలు రెండు లైన్లు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించినందుకు కర్ణాటక ప్రజలను నేను అభినందిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లోని బైయప్పనహళ్లి నుండి కృష్ణరాజపుర, కెంగేరి నుండి చల్లఘట్ట కాళ్లు సెక్షన్లు అధికారిక ప్రారంభోత్సవం కోసం వేచి ఉండకుండా అక్టోబర్ 9 నుంచి ప్రజల కోసం తెరవబడ్డాయి. దీనితో ‘నమ్మ మెట్రో’ మొత్తం కార్యాచరణ పొడవు 66 స్టేషన్లతో 74 కి.మీలకు, రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 7.5 లక్షలకు పెరిగింది.12 ఏళ్ల క్రితం ప్రారంభించిన నమ్మ మెట్రో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్. తూర్పు-పశ్చిమ కారిడార్.. వైట్ఫీల్డ్ (కడుగోడి) నుంచి చల్లఘట్ట వరకు పర్పుల్ లైన్ ఇప్పుడు 37 స్టేషన్లతో కూడిన మొత్తం పొడవు 43.49 కి.మీ.గా ఉంది. మైసూరులో మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలపై కూడా ప్రధాన మంత్రి ప్రసంగం సందర్భంగా సూచన చేశారు.
Also Read
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
Also Read: Akhilesh Yadav: ఇండియా కూటమి నుంచి అఖిలేష్ యాదవ్ ఔట్!
ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 2031 నాటికి 317 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్కు రాష్ట్ర ప్రభుత్వం తన సమగ్ర మొబిలిటీ ప్లాన్ (సీఎమ్పి)లో ఆమోదం తెలిపింది. ఇందులో 217 కిమీ పొడవైన మార్గం ఆపరేషన్, నిర్మాణం లేదా ప్రణాళిక దశలో ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బెంగళూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇక్కడ ట్రాఫిక్ పెద్ద సమస్యగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ సేవల విస్తరణ చాలా అవసరమన్నారు.
30,695 కోట్ల అంచనా వ్యయంతో 75.06 కిలోమీటర్ల పొడవున్న బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2ను చేపట్టామని సిద్ధరామయ్య వెల్లడించారు. ఈరోజు లాంఛనంగా ప్రారంభించిన రెండు స్ట్రెచ్లతో సహా కనీసం 32 కి.మీ పని పూర్తి చేసి, కార్యకలాపాల కోసం ప్రారంభించబడిందన్నారు. ఉత్తర దిశలో నాగసంద్ర నుండి మాదవరానికి 3.14 కి.మీ పొడవుతో, ఆర్వీ రోడ్డు నుండి బొమ్మసంద్ర వరకు 19.15 కి.మీ కొత్త మార్గంతో కూడిన మెట్రో సేవల పొడిగింపు తుదిదశకు చేరుకుందన్నారు. 2024 ఏప్రిల్ నాటికి దీన్ని ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 025 మార్చి నాటికి కళేన అగ్రహారం నుంచి నాగవారం వరకు 21.26 కి.మీ కొత్త మెట్రో లైన్ పూర్తవుతుందన్నారు.. ఈ మార్గాలు పూర్తయితే మొత్తం మెట్రో నెట్వర్క్ 117 కి.మీలకు విస్తరించి 12 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెట్రో ప్రాజెక్ట్ కోసం కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.11,583.08 కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..