Bangalore Metro: బెంగళూరు మెట్రోలో 2 కొత్త సెక్షన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
Bangalore Metro: బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లోని బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట కాళ్ల వరకు మెట్రో రైలు సేవలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.”బెంగళూరు మెట్రో రైలు రెండు లైన్లు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించినందుకు కర్ణాటక ప్రజలను నేను అభినందిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లోని బైయప్పనహళ్లి నుండి కృష్ణరాజపుర, కెంగేరి నుండి చల్లఘట్ట కాళ్లు సెక్షన్లు అధికారిక ప్రారంభోత్సవం కోసం వేచి ఉండకుండా అక్టోబర్ 9 నుంచి ప్రజల కోసం తెరవబడ్డాయి. దీనితో ‘నమ్మ మెట్రో’ మొత్తం కార్యాచరణ పొడవు 66 స్టేషన్లతో 74 కి.మీలకు, రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 7.5 లక్షలకు పెరిగింది.12 ఏళ్ల క్రితం ప్రారంభించిన నమ్మ మెట్రో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్. తూర్పు-పశ్చిమ కారిడార్.. వైట్ఫీల్డ్ (కడుగోడి) నుంచి చల్లఘట్ట వరకు పర్పుల్ లైన్ ఇప్పుడు 37 స్టేషన్లతో కూడిన మొత్తం పొడవు 43.49 కి.మీ.గా ఉంది. మైసూరులో మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలపై కూడా ప్రధాన మంత్రి ప్రసంగం సందర్భంగా సూచన చేశారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Also Read: Akhilesh Yadav: ఇండియా కూటమి నుంచి అఖిలేష్ యాదవ్ ఔట్!
ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 2031 నాటికి 317 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్కు రాష్ట్ర ప్రభుత్వం తన సమగ్ర మొబిలిటీ ప్లాన్ (సీఎమ్పి)లో ఆమోదం తెలిపింది. ఇందులో 217 కిమీ పొడవైన మార్గం ఆపరేషన్, నిర్మాణం లేదా ప్రణాళిక దశలో ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బెంగళూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇక్కడ ట్రాఫిక్ పెద్ద సమస్యగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ సేవల విస్తరణ చాలా అవసరమన్నారు.
30,695 కోట్ల అంచనా వ్యయంతో 75.06 కిలోమీటర్ల పొడవున్న బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2ను చేపట్టామని సిద్ధరామయ్య వెల్లడించారు. ఈరోజు లాంఛనంగా ప్రారంభించిన రెండు స్ట్రెచ్లతో సహా కనీసం 32 కి.మీ పని పూర్తి చేసి, కార్యకలాపాల కోసం ప్రారంభించబడిందన్నారు. ఉత్తర దిశలో నాగసంద్ర నుండి మాదవరానికి 3.14 కి.మీ పొడవుతో, ఆర్వీ రోడ్డు నుండి బొమ్మసంద్ర వరకు 19.15 కి.మీ కొత్త మార్గంతో కూడిన మెట్రో సేవల పొడిగింపు తుదిదశకు చేరుకుందన్నారు. 2024 ఏప్రిల్ నాటికి దీన్ని ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 025 మార్చి నాటికి కళేన అగ్రహారం నుంచి నాగవారం వరకు 21.26 కి.మీ కొత్త మెట్రో లైన్ పూర్తవుతుందన్నారు.. ఈ మార్గాలు పూర్తయితే మొత్తం మెట్రో నెట్వర్క్ 117 కి.మీలకు విస్తరించి 12 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెట్రో ప్రాజెక్ట్ కోసం కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.11,583.08 కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!