Bangalore Metro: బెంగళూరు మెట్రోలో 2 కొత్త సెక్షన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangalore Metro: బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లోని బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట కాళ్ల వరకు మెట్రో రైలు సేవలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.”బెంగళూరు మెట్రో రైలు రెండు లైన్లు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించినందుకు కర్ణాటక ప్రజలను నేను అభినందిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లోని బైయప్పనహళ్లి నుండి కృష్ణరాజపుర, కెంగేరి నుండి చల్లఘట్ట కాళ్లు సెక్షన్లు అధికారిక ప్రారంభోత్సవం కోసం వేచి ఉండకుండా అక్టోబర్ 9 నుంచి ప్రజల కోసం తెరవబడ్డాయి. దీనితో ‘నమ్మ మెట్రో’ మొత్తం కార్యాచరణ పొడవు 66 స్టేషన్లతో 74 కి.మీలకు, రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 7.5 లక్షలకు పెరిగింది.12 ఏళ్ల క్రితం ప్రారంభించిన నమ్మ మెట్రో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్. తూర్పు-పశ్చిమ కారిడార్.. వైట్ఫీల్డ్ (కడుగోడి) నుంచి చల్లఘట్ట వరకు పర్పుల్ లైన్ ఇప్పుడు 37 స్టేషన్లతో కూడిన మొత్తం పొడవు 43.49 కి.మీ.గా ఉంది. మైసూరులో మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలపై కూడా ప్రధాన మంత్రి ప్రసంగం సందర్భంగా సూచన చేశారు.
Also Read
- Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
Also Read: Akhilesh Yadav: ఇండియా కూటమి నుంచి అఖిలేష్ యాదవ్ ఔట్!
ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 2031 నాటికి 317 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్కు రాష్ట్ర ప్రభుత్వం తన సమగ్ర మొబిలిటీ ప్లాన్ (సీఎమ్పి)లో ఆమోదం తెలిపింది. ఇందులో 217 కిమీ పొడవైన మార్గం ఆపరేషన్, నిర్మాణం లేదా ప్రణాళిక దశలో ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బెంగళూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇక్కడ ట్రాఫిక్ పెద్ద సమస్యగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ సేవల విస్తరణ చాలా అవసరమన్నారు.
30,695 కోట్ల అంచనా వ్యయంతో 75.06 కిలోమీటర్ల పొడవున్న బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2ను చేపట్టామని సిద్ధరామయ్య వెల్లడించారు. ఈరోజు లాంఛనంగా ప్రారంభించిన రెండు స్ట్రెచ్లతో సహా కనీసం 32 కి.మీ పని పూర్తి చేసి, కార్యకలాపాల కోసం ప్రారంభించబడిందన్నారు. ఉత్తర దిశలో నాగసంద్ర నుండి మాదవరానికి 3.14 కి.మీ పొడవుతో, ఆర్వీ రోడ్డు నుండి బొమ్మసంద్ర వరకు 19.15 కి.మీ కొత్త మార్గంతో కూడిన మెట్రో సేవల పొడిగింపు తుదిదశకు చేరుకుందన్నారు. 2024 ఏప్రిల్ నాటికి దీన్ని ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 025 మార్చి నాటికి కళేన అగ్రహారం నుంచి నాగవారం వరకు 21.26 కి.మీ కొత్త మెట్రో లైన్ పూర్తవుతుందన్నారు.. ఈ మార్గాలు పూర్తయితే మొత్తం మెట్రో నెట్వర్క్ 117 కి.మీలకు విస్తరించి 12 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెట్రో ప్రాజెక్ట్ కోసం కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.11,583.08 కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!