Sanjay Raut: 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఉద్ధవ్ ఠాక్రే ద్రోహం చేశారని అమిత్ షా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై శివసేన(యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విరుచుకపడ్డారు. ఉద్దవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. శనివారం నాందేడ్ లో జరిగిన అమిత్ షా ర్యాలీని సంజయ్ రౌత్ ప్రస్తావసి్తూ.. ఉద్ధవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడటం విశేషం…
Maharashtra: మహారాష్ట్రలో మరో రాజకీయ సంక్షోభం రాబోతోందా..? అంటే శివసేన( ఉద్ధవ్) పార్టీ మౌత్ పీస్ పత్రిక అయిన ‘సామ్నా’ ఔననే అంటోంది. ఉద్దవ్ వర్గానికి మద్దతుగా సామ్నా పత్రిక కొన్ని కీలక విషయాలను పేర్కొంది. ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని,
Sanjay Raut: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై ఘాటు విమర్శలు చేశారు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్. శనివారం బీజేపీని మొసలి, కొండచిలువతో పోల్చారు. ఒకరు రోజు ముందు శివసేన ఎంపీ గజానన్ కీర్తీకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి శివసేన పార్టీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత ఈ రోజు సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
Maharashtra Political Crisis: మహరాష్ట్ర రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి నిరాకరించింది. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను శివసేన విప్గా నియమిస్తూ హౌస్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీం పేర్కొంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీ ప్రభుత్వానికి విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. పార్టీ ఫిరాయించిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్ పై రేపు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. గతేడాది శివసేన తిరుగుబాటుపై ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 జూన్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసినందుకు ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత…
Sharad Pawar: శివసేన పత్రిక సామ్నా శరద్ పవార్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ రాజీనామా ‘‘ప్లాన్’’ ప్రకారమే జరిగిందని సామ్నా పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. రాజీనామాకు ముందుగానే ఆయన ప్రసంగం సిద్ధం చేసుకున్నారని వెల్లడించింది. శరద్ పవార్ రాజీనామా సీనియర్ ఎన్సీపీ నాయకులు అయిన ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్ తో సహా చాలా మంది షాక్ ఇచ్చింది.
మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ బీజేపీతో కలుస్తారన్న ప్రచారంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తన మద్దతుదారులతో బీజేపీలో చేరేందుకు అజిత్ పవార్ చర్చలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ కూటమి కొనసాగుతోంది. ప్రస్తతం ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి మధ్య చీలిక వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాయకుల మధ్య విభేదాల కారణంగా కూటమికి బీటలు వారాయి అని చర్చలు జరుగుతున్నాయి.
Uddhav Thackeray: మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చుపెట్టాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఒక్క శివసేన కార్యకర్త కూడా లేరని ఆయన వ్యాఖ్యానించిన మరుసటి రోజు శివసేన(యూబీటీ)నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు.
క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్ కాదు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.