Sanjay Raut: బీజేపీ మొసలి, కొండ చిలువ.. వారితో వెళ్తే అంతే సంగతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై ఘాటు విమర్శలు చేశారు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్. శనివారం బీజేపీని మొసలి, కొండచిలువతో పోల్చారు. ఒకరు రోజు ముందు శివసేన ఎంపీ గజానన్ కీర్తీకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి శివసేన పార్టీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత ఈ రోజు సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
బీజేపీ ఎవరినైనా మింగే మొసలి, కొండచిలువ లాంటిదని అన్నారు. దానితో వెళ్తే ఇక అంతే సంగతులంటూ వ్యాఖ్యానించారు. 2019 మహారాష్ట్ర ఎన్నికలను ప్రస్తావిస్తూ.. బీజేపీ, శివసేన విభేదాల కారణంగా శివసేన ఆ పార్టీకి దూరంగా ఉండాలని అనుకుందని, శివసేనను ఖతం చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని సంజయ్ రౌత్ విమర్శించారు. బీజేపీతో అంటకాగుతున్న పార్టీలను అంతం చేయాలని అనుకుంటుందని అన్నారు. ఇప్పుడు శివసేనలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు విషయాన్ని గుర్తిస్తున్నారని, ఇలాంటి మొసలికి దూరం కావడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
Also Read
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
Read Also: Sai Dharam Tej: చక్రవ్యూహం ట్రైలర్ లాంచ్ చేసిన సుప్రీమ్ హీరో
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చాలా అశాంతి నెలకొందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాట నిలబెట్టుకోవడం లేదని, శివసేన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని, పైగా వారిని అవమానించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. దీంతోనే మహారాష్ట్ర, పార్టీ గౌరవం కోసం ఉద్ధవ్ ఠాక్రే ఆ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీస్తున్నారని సంజయ్ రౌత్ అన్నారు.
2019 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ, శివసేన మెజారిటీ సీట్లను సాధించింది. అయితే సీఎం శివసేనకు కావాలని పేచీ పెట్టడంతో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిగా ‘మహావికాస్ అఘాడీ’ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత గతేడాది ఏక్ నాథ్ షిండే తిరుగుబాటులో మళ్లీ మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!