Devendra Fadnavis: ఇప్పుడు మీ సిద్ధాంతం ఏమైంది ఉద్ధవ్ ఠాక్రే..? సావర్కర్ సిలబస్పై ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సావర్కర్, హెడ్గేవార్ సిలబస్ ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించింది. గతంలో బీజేపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులన్నింటిని రద్దు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తన మాజీ మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రేని టార్గెట్ చేశాడు. గతంలో రాహుల్ గాంధీ సావర్కర్ పై విమర్శలు చేసిన సందర్భంలో ఉద్దవ్ ఠాక్రే అతనిపై విమర్శలు గుప్పించాడు. సావర్కర్ తమకు దేవుడని, రోల్ మోడల్ అని అతడిని అవమానిస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
Read Also: iQoo Neo 7 Pro: iQoo స్మార్ట్ఫోన్ ఫీచర్స్ చూశారంటే అదిరిపోద్ది.. త్వరలో మార్కెట్లో లాంఛ్..!
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సావర్కర్ సిలబస్ తొలగించడంపై ఎందుకు నోరు మెదపడం లేదని ఫడ్నవీస్, ఉద్దవ్ ఠాక్రేని ప్రశ్నించారు. అధికారం కోసం ఠాక్రే సిద్ధాంతం, భావజాలంపై రాజీ పడ్డాడని ఆరోపించారు. ఒక పుస్తకం నుంచి ఒకరి పేరు చెరిపేయొచ్చు.. కానీ హృదయం నుంచి చెరిపేయలేరని ఆయన అన్నారు. అధికారం కోసం మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ తో జతకట్టాడని.. అధికారం కోసం మైనారిటీల బుజ్జగింపు జరుగుతున్నాయని మీరు అంగీకరిస్తారా..? సావర్కర్ ని అవమానించడాన్ని మీరు అంగీకరిస్తారా..? అని ప్రశ్నించారు. మీరు కాంగ్రెస్ తో జతకడుతున్నారు, వారు సావర్కర్ పేరును చెరిపేయాలని అనుకుంటున్నారని, మతమార్పిడికి మద్దతు ఇవ్వబోతున్నారని అన్నారు. మీరు అధికారంలో కోసమే రాజీ పడుతున్నారని ఉద్ధవ్ ఠాక్రేని ఫడ్నవీస్ విమర్శించారు.
బిజెపి అధికారంలో ఉన్నప్పుడు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానానికి అనుగుణంగా, సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం క్యాబినెట్ తీర్మానంలో రాష్ట్రంలో 6 నుండి 10 తరగతుల కన్నడ మరియు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను సవరించడానికి ఆమోదించింది. ఈ విద్యా సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెడ్గేవార్ మరియు హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్ల అధ్యాయాలను తొలగించింది.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?