Shiv Sena: ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలో చేరిన కీలక నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiv Sena: మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంఎల్సీ మనీషా కయాండే ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. శివసేన వ్యవస్థాపక దినోత్సవం రోజునే మనీషా కయాండే షిండే వర్గంలో చేరిపోయింది. రెండు రోజుల్లో వరసగా ఉద్దవ్ వర్గానికి రెండు షాక్ లు తగిలాయి. మనీషా కయాండే శివసేన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. అంతకుముందు రోజు కీలక నేత శిశిర్ షిండే ఠాక్రే వర్గం నుంచి షిండే వర్గంలో చేరిపోయారు.
ఉద్ధవ్ వర్గాన్ని విడిచి నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారనే దానిపై ఆయన వర్గం ఆత్మపరిశీలన చేసుకుంటుందో లేదో చూడటానికి తాను ఒక ఏడాది పాటు వేచి ఉన్నానని కయాండే అన్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బాలాసాహెబ్ ఠాక్రేకు చెందిన అసలు సేన అని ఆమె అన్నారు. షిండే ప్రభుత్వం గత జూన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమర్ధవంతంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే కయాండే ప్రశంసించారు. ఎన్సీపీ, కాంగ్రెస్ ఎజెండాలను ప్రచారం చేసినందుకు ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్, సుష్మా అంధారేలపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read Also: Kedarnath: కేదార్నాథ్లో బంగారం కుంభకోణం.. పూజారి ఆరోపణతో కలకలం..
ప్రతీరోజు ఉదయం ఇతరులను విమర్శిస్తూ.. కాంగ్రెస్, ఎన్సీపీల ఎజెండాను ముందు తీసుకువచ్చి, హిందూ దేవీదేవతలకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు శివసేనకు చెందిన వారు కాలేరని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే కయాండే షిండే వర్గంలో చేరే కొన్ని గంటల ముందు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ థాకరే వర్గం ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. తాను ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, ఉద్ధవ్ పార్టీ మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని సంచనల ఆరోపణలు చేశారు.
2012లో శివసేన పార్టీలో చేరారు మనీషా కయాండే. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేన పొత్తుపై పార్టీలో ఎవరూ అనుకూలంగా లేరని ఆమె అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అయిన ఆమె పదవీ కాలం జూలై 27, 2024న ముగుస్తుంది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహా వికాస్ అఘాడి ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ, ఠాక్రే అధికారం కోసం తన సిద్ధాంతాన్ని రాజీ చేసుకున్నారని షిండే అన్నారు. శివసేన-బిజెపి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిజమైన కృషి చేస్తోందని, గత ఎంవిఎ ప్రభుత్వం ఆపివేసిన ప్రాజెక్టులను వేగవంతం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..