Devendra Fadnavis: జాతీయవాద ముస్లింలు ఎవరూ ఔరంగజేబును తమ నాయకుడిగా గుర్తించరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: భారతదేశంలోని ముస్లింలు ఎవరూ ఔరంగజేబ్ కాదని, దేశంలోని జాతీయవాద ముస్లింలు ఎవరూ కూడా మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా గుర్తించరని మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఔరంగబాద్ లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన చర్యను ఆమోదించారా..? అని ప్రశ్నించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్ధవ్ ఠాక్రే, అంబేద్కర్ పొత్తు పెట్టుకున్నారు.
ఔరంగేజేబును పొడుగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలో ఇటీవల మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి సమయంలో ప్రకాష్ అంబేద్కర్, జౌరంగజేబు సమాధిని సందర్శించారు. ఔరంగజేబు మన నాయకుడు ఎలా అవుతాడు? మన రాజు ఒక్కడే, అది ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. జాతీయవాద ముస్లింలు ఎవరూ ఔరంగజేబును తమ నాయకుడిగా అంగీకరించరని, అతని వారసులు దేశం బయట ఉన్నారని వ్యాఖ్యానించారు. ముస్లింలు ఔరంగజేబును ఆమోదించరని, శివాజీనే తమ నాయకుడిగా గుర్తిస్తారని అన్నారు.
Also Read
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
Read Also: North Korea: నార్త్ కొరియా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది.. అధికారులకు మూడింది..
ఔరంగజేబు మన దేశాన్ని చాలా కాలం పాలించారని అంబేద్కర్ అన్నారు.. అయితే హిట్లర్ కూడా జర్మనీని చాలా కాలం పాలించాడు, ఆయన కూడా దేవుడు అవుతాడా.. అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఉద్ధవ్ ఠాక్రే, ప్రకాష్ అంబేద్కర్ తో పొత్తు పెట్టుకున్నాడు.. ఇప్పుడు ఆయన చర్యలను ఠాక్రే అంగీకరిస్తున్నారా..? అని అడిగారు. అంతకుముందు కొల్హాపూర్ పట్టణంలో ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టులో పెట్టడంతో హిందువులు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఔరంగజేబు వారసులే ఇలాంటి పనులు చేస్తారని ఆరోపించారు.
గతంలో ఎన్సీపీతో చేతులు కలిపితే పార్టీ మూసేస్తానన్న బాల్ ఠాక్రే వ్యాఖ్యలను ఫడ్నవీస్ గుర్తు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి వెన్నుపోటు పొడిచి ఎన్సీపీ-కాంగ్రెస్ తో చేతులు కలిపారని, ఆ సమయం మళ్లీ వస్తానని నేను చెప్పానని, మళ్లీ రావడమే కాదు ఏక్ నాథ్ షిండేను సీఎంగా తీసుకువచ్చానని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే తన భావజాలాన్ని పక్కన పెట్టి ప్రధాని మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..