మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చీతాల వరుస మృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం(Supreem Court) ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒకదాని వెంట ఒకటి మృతి చెందుతుండటంతో.. దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతవారం రెండు చీతాలు చనిపోవడాన్ని ప్రస్తావించిన…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. చట్టాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని వ్యాఖ్యానించింది. కొత్త చట్టాలు అతిగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసింది.
హైదరాబాద్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సరూర్ నగర్ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కలకలం రేపింది. ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించిన ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల కిడ్నాప్ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ ను ఫోన్లో కోరింది.
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇవాళ ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు వచ్చే వెహికిల్స్ ను పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడారు. సుమారు 1700 వాహనాలను సీజ్ చేశారని ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం సభకు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేరుకుంది. రహదారిపై పాదయాత్రగా వెళ్తున్న భట్టికి.. కొలిమి వద్ద ఇనుప పని చేసుకుంటున్న బాలాజీ వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాము మహారాష్ట్ర నుంచి ఇక్కడకు పనిచేసుకునేందుకు వచ్చామని.. పెరిగిన ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
ఫుడ్ అంటే పిల్లలు లొట్టలేసుకుని తింటారు. అందులో చిరుతిండ్లు ఫుల్ గా తినేస్తారు. ఇంకేముంది ఓ ఐదేళ్ల పాప కడుపు నిండా తినేసింది. చివరకు ప్రాణప్రాయ స్థితికి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతంలో చోటుచేసుకుంది.
సీఎం కొడుకుతో చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని నిజామాబాద్ ఎంపీ బిజెపి ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటామని మండిపడ్డారు. సస్పెండ్ ఎవర్ని చేయాలో.. ఎవరకి బాధ్యతలు ఇవ్వాలో బీజేపీ నాయకత్వానికి తెలుసని నిప్పులు చెరిగారు. తెలంగాణలో అత్యాచారాలపై ప్రభుత్వం పెద్దలు ఏమి సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తోన్న ఉచిత రేషన్ బియ్యాన్ని ముఖ్యమంత్రి కొడుకు బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నాడని విమర్శించారు. గ్రూప్ వన్ పరీక్షలో ఉర్థూ…
అమ్నేసియా పబ్ కేసు విషయమై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బాలికపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించింది. సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీకి మహిళ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేసు రిపోర్ట్ చూసిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సునీతా లక్ష్మారెడ్డి…
ఏపీలో మహిళలు, మహిళా ఉద్యోగినులు, పాఠశాలల్లో విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కీచక ఉపాధ్యాయుల భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల వరుసగా జరిగిన వేధింపుల ఘటనలపై వాసిరెడ్డి స్పందించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. గుంటూరు రూరల్ పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో మాట్లాడి…