HEALTH: తెలిసి తెలియని వయసు.. బాగా తినేసింది. ఆరోగ్యం విషమంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HEALTH: ఫుడ్ అంటే పిల్లలు లొట్టలేసుకుని తింటారు. అందులో చిరుతిండ్లు ఫుల్ గా తినేస్తారు. ఇంకేముంది ఓ ఐదేళ్ల పాప కడుపు నిండా తినేసింది. చివరకు ప్రాణప్రాయ స్థితికి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎంత తినాలో తెలియని వయసు కావడంతో కడుపు టైట్ అయ్యేలా లాగించేసింది. అలా తింటుంటే తల్లిదండ్రులు ఎవరు దగ్గర్లో లేకపోవడంతో డేంజర్ జోన్ లో పడింది ఆ పాప. దారుణ విషయం ఏటంటే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే కావడం.
Read Also: Viral News: ఇదేం పైత్యం సామి.. ఆఖరికి పాములను కూడా వదలరా..
Also Read
- CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
- AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
అసలు పాపకు అలా జరగడానికి కారణమేంటంటే.. ఒకే రోజు రాత్రి రెండు పుట్టిన రోజు వేడుకలకు పాప పేరేంట్స్ తీసుకెళ్లారు. అక్కడ నూడుల్స్ మాదిరి చౌమీన్ ను తిన్నది. అక్కడి నుంచి వెంటనే మరో పుట్టిన రోజు వేడుకకు వెళ్లగా, అక్కడ స్వీట్ కార్న్ ను బాగా ఎక్కువ తినేసింది ఆ పాప. తర్వాత పిల్లలతో ఆడుకుంటూ పడిపోయింది. అంతలోనే కడుపులో నొప్పి అంటూ తట్టుకోలేని పరిస్థితిలో ఏడుస్తుండడంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉన్న కిమ్స్ కింగ్స్ వే హాస్పిటల్ కు తరలించారు.
Read Also: karnatraka: రూ.2000వేలు కావాలంటే.. దరఖాస్తు చేసుకోమన్న సీఎం
బాలిక పేరేంట్స్ ఏమీ అర్థంకాక అధికంగా తినడం వల్ల వస్తున్న నొప్పి అనుకున్నారు. దాంతో పాపక యాంటాసిడ్ సిరప్ తాగించినా.. తగ్గలేదు. బాలిక కింద పడిపోయిన అరగంటకు ఆసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రి డాక్టర్లు వెంటనే ఎక్స్ రే తీశారు. అందులోనూ ఏమీ తెలియలేదు. హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం, తీవ్ర నొప్పితో పాప తల్లడిల్లిపోతుండడంతో సీటీ స్కాన్ తీశారు. పొట్ట లోపల చీలినట్టు (పగిలిపోవడం/లేజరేషన్) గుర్తించారు వైద్యులు. వెంటనే లేపరోటామీ చికిత్స నిర్వహించారు. అనంతరం హైఫ్లో నాసల్ క్యానులాతో వెంటిలేటర్ పెట్టారు. అంతేకాకుండా 30 సెలైన్ బాటిళ్లతో వైద్యులు పాప పొట్టను క్లీన్ చేశారు. అయినా పాప పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అందుకే పిల్లలు తినే సమయంలో పేరేంట్స్ దగ్గరే ఉండే చూసుకోవాలని కిమ్స్ కింగ్స్ వే హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ గోయల్ సూచించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
-
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!