HEALTH: తెలిసి తెలియని వయసు.. బాగా తినేసింది. ఆరోగ్యం విషమంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HEALTH: ఫుడ్ అంటే పిల్లలు లొట్టలేసుకుని తింటారు. అందులో చిరుతిండ్లు ఫుల్ గా తినేస్తారు. ఇంకేముంది ఓ ఐదేళ్ల పాప కడుపు నిండా తినేసింది. చివరకు ప్రాణప్రాయ స్థితికి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎంత తినాలో తెలియని వయసు కావడంతో కడుపు టైట్ అయ్యేలా లాగించేసింది. అలా తింటుంటే తల్లిదండ్రులు ఎవరు దగ్గర్లో లేకపోవడంతో డేంజర్ జోన్ లో పడింది ఆ పాప. దారుణ విషయం ఏటంటే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే కావడం.
Read Also: Viral News: ఇదేం పైత్యం సామి.. ఆఖరికి పాములను కూడా వదలరా..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అసలు పాపకు అలా జరగడానికి కారణమేంటంటే.. ఒకే రోజు రాత్రి రెండు పుట్టిన రోజు వేడుకలకు పాప పేరేంట్స్ తీసుకెళ్లారు. అక్కడ నూడుల్స్ మాదిరి చౌమీన్ ను తిన్నది. అక్కడి నుంచి వెంటనే మరో పుట్టిన రోజు వేడుకకు వెళ్లగా, అక్కడ స్వీట్ కార్న్ ను బాగా ఎక్కువ తినేసింది ఆ పాప. తర్వాత పిల్లలతో ఆడుకుంటూ పడిపోయింది. అంతలోనే కడుపులో నొప్పి అంటూ తట్టుకోలేని పరిస్థితిలో ఏడుస్తుండడంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉన్న కిమ్స్ కింగ్స్ వే హాస్పిటల్ కు తరలించారు.
Read Also: karnatraka: రూ.2000వేలు కావాలంటే.. దరఖాస్తు చేసుకోమన్న సీఎం
బాలిక పేరేంట్స్ ఏమీ అర్థంకాక అధికంగా తినడం వల్ల వస్తున్న నొప్పి అనుకున్నారు. దాంతో పాపక యాంటాసిడ్ సిరప్ తాగించినా.. తగ్గలేదు. బాలిక కింద పడిపోయిన అరగంటకు ఆసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రి డాక్టర్లు వెంటనే ఎక్స్ రే తీశారు. అందులోనూ ఏమీ తెలియలేదు. హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం, తీవ్ర నొప్పితో పాప తల్లడిల్లిపోతుండడంతో సీటీ స్కాన్ తీశారు. పొట్ట లోపల చీలినట్టు (పగిలిపోవడం/లేజరేషన్) గుర్తించారు వైద్యులు. వెంటనే లేపరోటామీ చికిత్స నిర్వహించారు. అనంతరం హైఫ్లో నాసల్ క్యానులాతో వెంటిలేటర్ పెట్టారు. అంతేకాకుండా 30 సెలైన్ బాటిళ్లతో వైద్యులు పాప పొట్టను క్లీన్ చేశారు. అయినా పాప పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అందుకే పిల్లలు తినే సమయంలో పేరేంట్స్ దగ్గరే ఉండే చూసుకోవాలని కిమ్స్ కింగ్స్ వే హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ గోయల్ సూచించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!