కీచకుల భరతం పడతాం.. ఏపీ మహిళా కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మహిళలు, మహిళా ఉద్యోగినులు, పాఠశాలల్లో విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కీచక ఉపాధ్యాయుల భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల వరుసగా జరిగిన వేధింపుల ఘటనలపై వాసిరెడ్డి స్పందించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. గుంటూరు రూరల్ పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో మాట్లాడి ఆమె కేసు పూర్వాపరాలను తెలుసుకున్నారు.
తక్షణమే వాలంటీర్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని… రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించిన ఏ స్థాయి ఉద్యోగినైనా క్షమించరాదని పోలీసులకు చెప్పారు. అదేవిధంగా గుంటూరు రాజీవ్గాంధీ నగర్ లో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనపై గుంటూరు అర్బన్ పోలీసు అడిషనల్ ఎస్పీతో మాట్లాడి మహిళా కమిషన్ ఆరా తీసింది. విద్యార్ధినులకు నీలిచిత్రాలు చూపుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల టీచర్ విషయంలో అరెస్టుతో పాటు భవిష్యత్తులో మరొకరు అలా ప్రవర్తించని రీతిలో కఠినమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరాచకపర్వంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఏలూరు సబ్ రిజిస్ట్రార్ తోటి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఏలూరు రిజిస్ట్రేషన్ డిఐజీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.
పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఏలూరు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారని.. శాఖాపరమైన చర్యలపై అడగ్గా… తక్షణమే సబ్ రిజిస్టార్ డిప్యూటేషన్ ను రద్దు చేస్తున్నట్లు డిఐజీ సమాధానమిచ్చారన్నారు. మహిళలు, బాలికలకు జరుగుతున్న అన్యాయం, వేధింపులపై మహిళా కమిషన్ సత్వరమే స్పందిస్తుందని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
తాజావార్తలు
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!