కీచకుల భరతం పడతాం.. ఏపీ మహిళా కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మహిళలు, మహిళా ఉద్యోగినులు, పాఠశాలల్లో విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కీచక ఉపాధ్యాయుల భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల వరుసగా జరిగిన వేధింపుల ఘటనలపై వాసిరెడ్డి స్పందించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. గుంటూరు రూరల్ పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో మాట్లాడి ఆమె కేసు పూర్వాపరాలను తెలుసుకున్నారు.
తక్షణమే వాలంటీర్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని… రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించిన ఏ స్థాయి ఉద్యోగినైనా క్షమించరాదని పోలీసులకు చెప్పారు. అదేవిధంగా గుంటూరు రాజీవ్గాంధీ నగర్ లో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనపై గుంటూరు అర్బన్ పోలీసు అడిషనల్ ఎస్పీతో మాట్లాడి మహిళా కమిషన్ ఆరా తీసింది. విద్యార్ధినులకు నీలిచిత్రాలు చూపుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల టీచర్ విషయంలో అరెస్టుతో పాటు భవిష్యత్తులో మరొకరు అలా ప్రవర్తించని రీతిలో కఠినమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read
చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరాచకపర్వంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఏలూరు సబ్ రిజిస్ట్రార్ తోటి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఏలూరు రిజిస్ట్రేషన్ డిఐజీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.
పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఏలూరు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారని.. శాఖాపరమైన చర్యలపై అడగ్గా… తక్షణమే సబ్ రిజిస్టార్ డిప్యూటేషన్ ను రద్దు చేస్తున్నట్లు డిఐజీ సమాధానమిచ్చారన్నారు. మహిళలు, బాలికలకు జరుగుతున్న అన్యాయం, వేధింపులపై మహిళా కమిషన్ సత్వరమే స్పందిస్తుందని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!