కీచకుల భరతం పడతాం.. ఏపీ మహిళా కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మహిళలు, మహిళా ఉద్యోగినులు, పాఠశాలల్లో విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కీచక ఉపాధ్యాయుల భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల వరుసగా జరిగిన వేధింపుల ఘటనలపై వాసిరెడ్డి స్పందించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. గుంటూరు రూరల్ పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో మాట్లాడి ఆమె కేసు పూర్వాపరాలను తెలుసుకున్నారు.
తక్షణమే వాలంటీర్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని… రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించిన ఏ స్థాయి ఉద్యోగినైనా క్షమించరాదని పోలీసులకు చెప్పారు. అదేవిధంగా గుంటూరు రాజీవ్గాంధీ నగర్ లో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనపై గుంటూరు అర్బన్ పోలీసు అడిషనల్ ఎస్పీతో మాట్లాడి మహిళా కమిషన్ ఆరా తీసింది. విద్యార్ధినులకు నీలిచిత్రాలు చూపుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల టీచర్ విషయంలో అరెస్టుతో పాటు భవిష్యత్తులో మరొకరు అలా ప్రవర్తించని రీతిలో కఠినమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరాచకపర్వంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఏలూరు సబ్ రిజిస్ట్రార్ తోటి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఏలూరు రిజిస్ట్రేషన్ డిఐజీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.
పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఏలూరు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారని.. శాఖాపరమైన చర్యలపై అడగ్గా… తక్షణమే సబ్ రిజిస్టార్ డిప్యూటేషన్ ను రద్దు చేస్తున్నట్లు డిఐజీ సమాధానమిచ్చారన్నారు. మహిళలు, బాలికలకు జరుగుతున్న అన్యాయం, వేధింపులపై మహిళా కమిషన్ సత్వరమే స్పందిస్తుందని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!