Supreem Court: చీతాల మృతిపై సుప్రీం ఆందోళన.. కేంద్రంపై సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చీతాల వరుస మృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం(Supreem Court) ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒకదాని వెంట ఒకటి మృతి చెందుతుండటంతో.. దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతవారం రెండు చీతాలు చనిపోవడాన్ని ప్రస్తావించిన సుప్రీం.. దీనిని ఎందుకు ప్రతిష్టాత్మకంగా మారుస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని కునో నేషనల్ పార్క్ లో ఎందుకు పెట్టారని నిలదీసింది. వేరే చోటుకు తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయలేదని నిలదీసింది.
AP Government: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సర్కార్ సీరియస్.. ఫిర్యాదుకు రంగం సిద్ధం
Also Read
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ఆపరేషన్ చీతా ప్రాజెక్ట్ కోసం తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రాన్స్ లోకేషన్లో 50 శాతం మరణాలు సాధారణమేనని ఆమె వివరించారు. అయితే వన్యప్రాణులు భారతదేశ వాతావరణానికి సరిపోతాయా, కిడ్నీ, శ్వాస కోశ సమస్యలను ఎదుర్కొంటున్నాయా అనే అంశాన్ని తెలుసుకోవాలని కోర్ట్ ఆదేశించింది. అంటువ్యాధులు వాటి మరణాలకు దారితీస్తున్నాయని సమాధానమిచ్చారు. రాజస్థాన్లోని అభయారణ్యాలలో ఒకటి చిరుతపులికి ప్రసిద్ధి చెందిందని కోర్ట్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ అంశాన్ని కేంద్రం పరిగణనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్ట్ సూచించింది. చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.
GHMC: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్.. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
కాగా.. ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను భారత ప్రభుత్వం మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్కు తరలించిన విషయం తెలిసిందే. ఇండియాలో చీతాల సంతతిని నిలబెట్టడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోగా.. దీనికి సంబంధించి దక్షిణాఫ్రికాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందు గతేడాది సెప్టెంబర్ 17న ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కునో నేషనల్ పార్క్లో నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను విడుదల చేశారు. వాటిలో అనారోగ్యం కారణంగా ఒక చీతా మరణించింది.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!