India-Pakistan match: బీజేపీ ఫైర్ బ్రాండ్, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మరోసారి ఉద్ధవ్ సేన పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్లో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చుట్టూ ఉన్న వివాదం నేపథ్యంలో, మ్యాచ్పై ఉద్ధవ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నితేష్ రాణే, ఆదిత్య ఠాక్రేపై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిత్య ఠాక్రే బురఖా ధరించి మ్యాచ్ను రహస్యంగా చూస్తాడని రాణే ఆరోపించారు.
Uddhav Sena: బీజేపీ ప్రభుత్వం మరాఠీ ప్రజలపై హిందీ రుద్దుతుందనే కారణంతో 20 ఏళ్ల విభేదాలను పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం హిందీని మూడో భాషగా వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తర్వాత, ఠాక్రే సోదరులు శనివారం ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు.
Sanjay Raut: 1975,జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ‘‘అత్యవసర పరిస్థితి’’ని విధించారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయింది. అయితే, బీజేపీ ఎమర్జెన్సీని విమర్శిస్తూ భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ మాత్రం ఇందిరాగాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ సిందూర్పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్ను బీజేపీ రాజకీయం చేస్తోందని.. త్రివిధ దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్ను కమలనాథులు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన పాకిస్తాన్తో యుద్ధం చేసేలా లేరని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీర్లో పెద్ద ఊచకోత జరిగింది.
Sanjay Raut: మహారాష్ట్రలో ‘‘హిందీ వివాదం’’ నేపథ్యంలో విడిపోయిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసి పోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తనకు ఉద్ధవ్కి మధ్య ఉన్నవి చిన్న విభేదాలే అని, మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవి అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
Sanjay Raut: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో కీలక సూత్రధారి, ఉగ్రవాది అయిన పాక్ -కెనెడియన్ పౌరుడు తహవూర్ రాణానికి అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. ఈ దారుణ ఘటన జరిగిన 17 ఏళ్ల తర్వాత, నిందితుడిని భారత న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టారు. అంతకుముందు, అమెరికా భారత్కి తనను అప్పగించకుండా ఉండేందుకు రాణా విఫలయత్నాలు చేశాడు. చివరకు అమెరికా కోర్టులు భారత్కి అప్పగించాలని తీర్పు చెప్పాయి.
Sanjay Raut: ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ విరుచుకుపడుతున్నారు. మోడీ సెప్టెంబర్లో రిటైర్ అవుతారని, అందుకే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన ఈ రోజు మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రౌత్ మాట్లాడుతూ.. మోడీ కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని, ఎవరికి బాస్ కాదని అన్నారు. దశాబ్దాలుగా పనిచేసిన అద్వానీ వంటి అగ్ర నేతల కారణంగా బీజేపీ అధికార శిఖరానికి చేరుకుందని అన్నారు.
Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సెప్టెంబర్ నెలలో నరేంద్రమోడీ రిటైర్ అవబోతున్నారని ఆయన కామెంట్స్ చేయడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రౌత్ వాదనల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2029 ఎన్నికల తర్వాత కూడా మోడీ ప్రధాని పదవిలో కొనసాగుతారని చెప్పారు.
Sanjay Raut: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయాన్ని సందర్శించడంపై శివసేన యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పదవీ విరమణ ప్రణాళికలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు మోడీ తెలియజేశారని పేర్కొన్నారు.