Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాదులు బీజేపీలో చేరొచ్చు.. అందుకే పట్టుకోవడం లేదు
- పహల్గామ్ ఉగ్రవాదులు బీజేపీలో చేరొచ్చు
- బహుశా అందుకే పట్టుకోవడం లేదు
- శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్ను బీజేపీ రాజకీయం చేస్తోందని.. త్రివిధ దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్ను కమలనాథులు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతంలో పహల్గామ్లో కాల్పులకు పాల్పడ్డ ఆరుగురు ఉగ్రవాదులు పరారీలో ఉన్నారని.. వారంతా బీజేపీలో చేరే అవకాశం ఉందని.. అందుకే వారిని పట్టుకోవడం లేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: కవిత ఎపిసోడ్పై స్పందించొద్దు.. బీజేపీ నేతలకు కిషన్రెడ్డి కీలక సూచనలు..!
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
ఆపరేషన్ సిందూర్ను రాజకీయంగా వాడుకోవడానికి ప్రధాని మోడీ ప్రతి రాష్ట్రానికి వెళ్లి క్రెడిట్ తీసుకుంటున్నారని.. మన సైనికులు చేసిన దాన్ని మోడీ క్రెడిట్ తీసుకోవడమేంటి? అని ప్రశ్నించారు. రాహుల్గాంధీ నాయకత్వంలో ప్రత్యేక సమావేశం కోసం అందరి సంతకంతో కూడిన లేఖను పంపించినట్లు చెప్పారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను పెట్టాలని అడిగినా పెట్టలేదన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.. దానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించాలని అడిగితే.. దానికి రక్షణమంత్రి అధ్యక్షత వహించారన్నారు. ఇక ప్రత్యేక సమావేశాలు పెట్టాలని మల్లిఖార్జున ఖర్గే, రాహుల్గాంధీ లేఖలు రాసినా కేంద్రం ముందుకు రాలేదని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇప్పుడేమో ఆపరేషన్ సిందూర్ను రాజకీయంగా వాడుకునేందుకు మాత్రం ప్రధాని మోడీ ప్రతి రాష్ట్రం తిరుగుతున్నారని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: Government Survey: జనాభా పెరుగుదల.. ప్రభుత్వం ప్రత్యేక సర్వే..
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
#WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "The six terrorists of the Pahalgam attack are not being caught because one day you might get a press note from the BJP office saying those six people have joined the BJP." pic.twitter.com/oR3BpugaaW
— ANI (@ANI) May 30, 2025
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!