India-Pakistan match: ఆదిత్య ఠాక్రే బురఖా ధరించి ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తారు..
- ఆదిత్య ఠాక్రే బురఖా ధరించి ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తాడు..
- శివసేన(యూబీటీ) నేతలపై నితేష్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan match: బీజేపీ ఫైర్ బ్రాండ్, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మరోసారి ఉద్ధవ్ సేన పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్లో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చుట్టూ ఉన్న వివాదం నేపథ్యంలో, మ్యాచ్పై ఉద్ధవ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నితేష్ రాణే, ఆదిత్య ఠాక్రేపై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిత్య ఠాక్రే బురఖా ధరించి మ్యాచ్ను రహస్యంగా చూస్తాడని రాణే ఆరోపించారు.
‘”ఆదిత్య థాకరే రేపు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ను బుర్ఖాలో దాక్కుని చూస్తాడు. అతను పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు కూడా చేస్తాడు” అని రాణే అన్నారు. ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ మెరైన్ డ్రైవ్లో బ్లాక్ టికెట్లు అమ్ముతారని దుయ్యబట్టారు. దీనికి ముందు, ఇండియా-పాకిస్తాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్పై బీసీసీఐ నిర్ణయాన్ని ఖండిస్తూ, జాతివ్యతిరేకి అంటూ ఆదిత్య ఠాక్రే కామెంట్స్ చేశారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
Read Also: PM Modi Manipur Visit: ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన బాధితులు..
“బీసీసీఐ దేశ వ్యతిరేకిగా మారుతోంది. పాకిస్థాన్తో ఆడటానికి బీసీసీఐ ఎందుకు అంత ఉత్సాహంగా ఉంది? డబ్బు, టీవీ ఆదాయం, ప్రకటనల ఆదాయం కోసం దురాశ కారణంగానా లేదా ఆటగాళ్ల ఫీజుల కోసమా? కేవలం భారతదేశంలో ఉన్నందున పాకిస్థాన్ ఆసియా కప్ను బహిష్కరించగలిగినప్పుడు, బీసీసీఐ ఎందుకు అలా చేయకూడదు?” అని ఆదిత్య ఠాక్రే అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పౌరుల్ని చంపేశారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన దేశంతో భారత్ క్రికెట్ ఆడగటం ఏంటని మోడీ ప్రభుత్వంపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. పహల్గామ్ గాయాలు మాననప్పటికీ, పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేందుకు చూస్తోందని విమర్శించారు. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేదు’’ అనే ప్రధాని మాటల్ని గుర్తు చేస్తూ,‘‘యుద్ధం, క్రీడలు కూడా కలిసి ప్రవహించేందుకు సిద్ధంగా లేవు’’ అని ఠాక్రే అన్నారు.
తాజావార్తలు
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!