Sanjay Raut: ఠాక్రేలు తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబై బంద్.. అంత సీన్ లేదన్న ఫడ్నవీస్..
- ఠాక్రేలు తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబై బంద్..
- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్..
- అంత సీన్ లేదన్న ఫడ్నవీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో శివసేన యూబీటీ నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడే రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఠాక్రేలను ఎప్పటికీ తుడిచిపెట్టలేరు. మేము తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైని బంద్ చేయగలం’’ అని హెచ్చరించారు. జాతీయ మీడియా ఛానెల్లోని ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎంసీ ఎన్నిలకకు ముందు, 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిశారు. వీరిద్దరు ముంబై ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారు.
Read Also: Vijay Deverakonda: దేవరకొండ మార్కు కామెంట్స్
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు అక్కాచెళ్లిళ్ల పిల్లలని, వీరిద్దరికి తాను సన్నిహితుడినని, ఒక వేళ వీరిద్దరి కలయికలో తన పాత్ర ఏదైనా ఉంటే అదృష్టంగా భావిస్తానని అన్నారు. ఠాక్రే సోదరులు ఒక బ్రాండ్ అని, ఠాక్రేలు ఉంటేనే మరాఠీ ప్రజలు మనుగడ సాగిస్తారని ఆయన అన్నారు. రాబోయే ముంబై ఎన్నికల్లో ఠాక్రేల పార్టీల నుంచే మేయర్ వస్తారని అన్నారు. ఠాక్రే వర్గం ఇకపై ఏక్నాథ్ షిండేతో కలిసి పనిచేయదని అన్నారు. గతంలో కాంగ్రెస్తో కలియకపై మాట్లాడుతూ, హిందుత్వ-లౌకిక ఎజెండాపై విభేదాలు ఉన్నప్పటికీ, దేశానికి ప్రాధాన్యత ఇవ్వడంతోనే కాంగ్రెస్తో కలిసినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే, సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సంజయ్ రౌత్వి పనికిరాని బెదిరింపులని కొట్టిపారేశారు. ఏక్నాథ్ షిండేను ముంబైలో అడుగుపెట్టనివ్వమని చెప్పారని, కానీ ఆయన 50 మంది ఎమ్మెల్యేలతో వచ్చి రాజ్భవన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, బాల్ ఠాక్రే బతికి ఉన్నప్పుడు ముంబై బంద్ ఉండేదని,కానీ ఈ రోజుల్లో అది పనిచేయదని ఫడ్నవీస్ అన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..