Sanjay Raut: ప్రజాస్వామ్యానికి చౌకీదార్ ఇందిరా గాంధీ.. ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థించిన సంజయ్ రౌత్..
- ప్రజాస్వామ్యానికి నిజమైన చౌకీదార్ ఇందిరా గాంధీ..
- రాజ్యాంగానికి లోబడే ‘‘ఎమర్జెన్సీ’’ విధింపు..
- ఎమర్జెన్సీని సమర్థించిన శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: 1975,జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ‘‘అత్యవసర పరిస్థితి’’ని విధించారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయింది. అయితే, బీజేపీ ఎమర్జెన్సీని విమర్శిస్తూ భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ మాత్రం ఇందిరాగాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవిస్తూనే అత్యవసర పరిస్థితి విధించారని ఆయన అన్నారు. బీజేపీ పాలనను విమర్శిస్తూ.. 2014 నుంచి 11 ఏళ్లుగా దేశవ్యాప్తంగా అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకుందని చెప్పారు. ఎమర్జెన్సీ విధింపును విమర్శిస్తూ బీజేపీ ఈ రోజు రాజ్యాంగ హత్య దివస్గా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
దేశ భద్రతకు ఏదైనా బాహ్య లేదా అంతర్గత శక్తి ద్రోహం చేసినప్పుడు, ఎవరైనా అరాచకాన్ని వ్యాప్తి చేయాలనుకున్నప్పుడు ప్రధాని ఆమోదంతో రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించవచ్చని సంజయ్ రౌత్ అన్నారు. ఇది రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన హక్కు అని చెప్పారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవిస్తూ ఎమర్జెన్సీ విధించారని చెప్పారు. దీనిని రాజ్యాంగ హత్య దివాస్గా పరిగణించలేము అని చెప్పారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ రిగ్గింగ్ ద్వారా ఎన్నికల్లో గెలవగలిగే వారు,కానీ అలా చేయలేదని, ఇప్పడు అదే జరుగుతోందని బీజేపీని విమర్శించారు.
ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యానికి చౌకీదార్ అని, ఆమె ఎన్నికల్లో మోసంతో గెలవలేదని రౌత్ ప్రశంసించారు. 2014 నుండి 11 సంవత్సరాలుగా ఈ దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందని అన్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ సమయంలో అవినీతిపరులంతా జైళ్లలో ఉన్నారని, బాలా సాహెబ్ ఠాక్రే అత్యవసర పరిస్థితిని సమర్థించారని అన్నారు. దేశంలో అరాచకం ప్రబలినప్పుడు ఎమర్జెన్సీ విధించే హక్కు ఉందని చెప్పారు.
#WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "By fully respecting the constitution, Indira Gandhi had imposed an emergency at that time…Emergency has constitutional recognition in democracy, so you cannot consider it as 'Samvidhan Hatya Diwas'. Indira Gandhi could have… pic.twitter.com/mZQoFaJWFT
— ANI (@ANI) June 25, 2025
తాజావార్తలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?