Sanjay Raut : బీజేపీ మైండ్ గేమ్స్ ఆడుతోంది.. యుద్ధం ఇంకా ముగియలేదు.!
- బీజేపీ అంకెల గేమ్ అంటూ రౌత్ ఆగ్రహం
- మేయర్ పీఠం తమదేనని శివసేన ధీమా
- ముంబైలో తీవ్ర ప్రతిష్టాత్మక పోరు
- అర్థరాత్రి ఫలితాలే అసలు ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాల వేళ మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ఒకవైపు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినట్లు కనిపిస్తున్నప్పటికీ, శివసేన (ఠాక్రే వర్గం) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజా ఫలితాలపై స్పందించిన శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ సృష్టిస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముంబై మేయర్ పీఠం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్, ఎన్నికల ఫలితాల గణాంకాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “బీజేపీ ఉదయం నుంచి తప్పుడు అంకెలు చూపిస్తూ ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. పోటీ చాలా తీవ్రంగా ఉంది. మా అభ్యర్థులు వైశాలి పాటంకర్, విశాఖ రౌత్, యశ్వంత్ కిల్లేదార్ వంటి వారు అనేక చోట్ల ముందంజలో ఉన్నారు. బాంద్రా నుంచి రోహిణి కాంబ్లే విజయం సాధించారు. బీజేపీ చూపిస్తున్న అంకెల గారడీని మేము నమ్మడం లేదు” అని రౌత్ వ్యాఖ్యానించారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Sai Pallavi: సాయి పల్లవి సెలక్షన్ తప్పిందా? కొత్త సినిమా పోస్టర్పై భగ్గుమంటున్న ఫ్యాన్స్!
ముంబై నగరానికి శివసేన ఇప్పటివరకు 23 మంది మేయర్లను అందించిందని గుర్తు చేసిన రౌత్, 24వ మేయర్ కూడా శివసేన (UBT) నుంచే ఉంటారని శపథం చేశారు. “ఠాక్రేను సవాలు చేయాలని చూశారు, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మీరు అధికారం , ధన బలంతో కొన్ని సీట్లు గెలిచి ఉండవచ్చు, కానీ ముంబై పోరాటం వేరు. ఇది ఇంకా ముగియలేదు. అర్థరాత్రి వరకు పూర్తి ఫలితాలు వస్తాయి, అప్పుడు అసలు చిత్రం కనిపిస్తుంది” అని ఆయన ఘాటుగా స్పందించారు.
ఈ పోరాటంలో ఎంఎన్ఎస్ (MNS) అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల గెలుస్తున్నారని, శరద్ పవార్ వర్గానికి కూడా కొన్ని సీట్లు దక్కవచ్చని రౌత్ పేర్కొన్నారు. ముంబై వెలుపల బీజేపీ సాధించిన విజయాలకు అభినందనలు తెలుపుతూనే, ముంబైలో మాత్రం శివసేన గట్టి పోటీని ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు మేయర్ పీఠం కోసం పోరాడుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతున్నప్పటికీ, ముంబై మేయర్ పీఠం విషయంలో మాత్రం సంజయ్ రౌత్ సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి వెలువడే పూర్తి ఫలితాలు ముంబై మున్సిపల్ కోటపై ఎవరు జెండా పాతతారో తేల్చనున్నాయి.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?