Sanjay Raut : బీజేపీ మైండ్ గేమ్స్ ఆడుతోంది.. యుద్ధం ఇంకా ముగియలేదు.!
- బీజేపీ అంకెల గేమ్ అంటూ రౌత్ ఆగ్రహం
- మేయర్ పీఠం తమదేనని శివసేన ధీమా
- ముంబైలో తీవ్ర ప్రతిష్టాత్మక పోరు
- అర్థరాత్రి ఫలితాలే అసలు ట్విస్ట్
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాల వేళ మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ఒకవైపు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినట్లు కనిపిస్తున్నప్పటికీ, శివసేన (ఠాక్రే వర్గం) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజా ఫలితాలపై స్పందించిన శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ సృష్టిస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముంబై మేయర్ పీఠం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్, ఎన్నికల ఫలితాల గణాంకాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “బీజేపీ ఉదయం నుంచి తప్పుడు అంకెలు చూపిస్తూ ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. పోటీ చాలా తీవ్రంగా ఉంది. మా అభ్యర్థులు వైశాలి పాటంకర్, విశాఖ రౌత్, యశ్వంత్ కిల్లేదార్ వంటి వారు అనేక చోట్ల ముందంజలో ఉన్నారు. బాంద్రా నుంచి రోహిణి కాంబ్లే విజయం సాధించారు. బీజేపీ చూపిస్తున్న అంకెల గారడీని మేము నమ్మడం లేదు” అని రౌత్ వ్యాఖ్యానించారు.
Also Read
Sai Pallavi: సాయి పల్లవి సెలక్షన్ తప్పిందా? కొత్త సినిమా పోస్టర్పై భగ్గుమంటున్న ఫ్యాన్స్!
ముంబై నగరానికి శివసేన ఇప్పటివరకు 23 మంది మేయర్లను అందించిందని గుర్తు చేసిన రౌత్, 24వ మేయర్ కూడా శివసేన (UBT) నుంచే ఉంటారని శపథం చేశారు. “ఠాక్రేను సవాలు చేయాలని చూశారు, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మీరు అధికారం , ధన బలంతో కొన్ని సీట్లు గెలిచి ఉండవచ్చు, కానీ ముంబై పోరాటం వేరు. ఇది ఇంకా ముగియలేదు. అర్థరాత్రి వరకు పూర్తి ఫలితాలు వస్తాయి, అప్పుడు అసలు చిత్రం కనిపిస్తుంది” అని ఆయన ఘాటుగా స్పందించారు.
ఈ పోరాటంలో ఎంఎన్ఎస్ (MNS) అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల గెలుస్తున్నారని, శరద్ పవార్ వర్గానికి కూడా కొన్ని సీట్లు దక్కవచ్చని రౌత్ పేర్కొన్నారు. ముంబై వెలుపల బీజేపీ సాధించిన విజయాలకు అభినందనలు తెలుపుతూనే, ముంబైలో మాత్రం శివసేన గట్టి పోటీని ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు మేయర్ పీఠం కోసం పోరాడుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతున్నప్పటికీ, ముంబై మేయర్ పీఠం విషయంలో మాత్రం సంజయ్ రౌత్ సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి వెలువడే పూర్తి ఫలితాలు ముంబై మున్సిపల్ కోటపై ఎవరు జెండా పాతతారో తేల్చనున్నాయి.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!