Sanjay Raut : బీజేపీ మైండ్ గేమ్స్ ఆడుతోంది.. యుద్ధం ఇంకా ముగియలేదు.!
- బీజేపీ అంకెల గేమ్ అంటూ రౌత్ ఆగ్రహం
- మేయర్ పీఠం తమదేనని శివసేన ధీమా
- ముంబైలో తీవ్ర ప్రతిష్టాత్మక పోరు
- అర్థరాత్రి ఫలితాలే అసలు ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాల వేళ మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ఒకవైపు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినట్లు కనిపిస్తున్నప్పటికీ, శివసేన (ఠాక్రే వర్గం) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజా ఫలితాలపై స్పందించిన శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ సృష్టిస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముంబై మేయర్ పీఠం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్, ఎన్నికల ఫలితాల గణాంకాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “బీజేపీ ఉదయం నుంచి తప్పుడు అంకెలు చూపిస్తూ ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. పోటీ చాలా తీవ్రంగా ఉంది. మా అభ్యర్థులు వైశాలి పాటంకర్, విశాఖ రౌత్, యశ్వంత్ కిల్లేదార్ వంటి వారు అనేక చోట్ల ముందంజలో ఉన్నారు. బాంద్రా నుంచి రోహిణి కాంబ్లే విజయం సాధించారు. బీజేపీ చూపిస్తున్న అంకెల గారడీని మేము నమ్మడం లేదు” అని రౌత్ వ్యాఖ్యానించారు.
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
Sai Pallavi: సాయి పల్లవి సెలక్షన్ తప్పిందా? కొత్త సినిమా పోస్టర్పై భగ్గుమంటున్న ఫ్యాన్స్!
ముంబై నగరానికి శివసేన ఇప్పటివరకు 23 మంది మేయర్లను అందించిందని గుర్తు చేసిన రౌత్, 24వ మేయర్ కూడా శివసేన (UBT) నుంచే ఉంటారని శపథం చేశారు. “ఠాక్రేను సవాలు చేయాలని చూశారు, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మీరు అధికారం , ధన బలంతో కొన్ని సీట్లు గెలిచి ఉండవచ్చు, కానీ ముంబై పోరాటం వేరు. ఇది ఇంకా ముగియలేదు. అర్థరాత్రి వరకు పూర్తి ఫలితాలు వస్తాయి, అప్పుడు అసలు చిత్రం కనిపిస్తుంది” అని ఆయన ఘాటుగా స్పందించారు.
ఈ పోరాటంలో ఎంఎన్ఎస్ (MNS) అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల గెలుస్తున్నారని, శరద్ పవార్ వర్గానికి కూడా కొన్ని సీట్లు దక్కవచ్చని రౌత్ పేర్కొన్నారు. ముంబై వెలుపల బీజేపీ సాధించిన విజయాలకు అభినందనలు తెలుపుతూనే, ముంబైలో మాత్రం శివసేన గట్టి పోటీని ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు మేయర్ పీఠం కోసం పోరాడుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతున్నప్పటికీ, ముంబై మేయర్ పీఠం విషయంలో మాత్రం సంజయ్ రౌత్ సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి వెలువడే పూర్తి ఫలితాలు ముంబై మున్సిపల్ కోటపై ఎవరు జెండా పాతతారో తేల్చనున్నాయి.
తాజావార్తలు
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..