Sanjay Raut : బీజేపీ మైండ్ గేమ్స్ ఆడుతోంది.. యుద్ధం ఇంకా ముగియలేదు.!
- బీజేపీ అంకెల గేమ్ అంటూ రౌత్ ఆగ్రహం
- మేయర్ పీఠం తమదేనని శివసేన ధీమా
- ముంబైలో తీవ్ర ప్రతిష్టాత్మక పోరు
- అర్థరాత్రి ఫలితాలే అసలు ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాల వేళ మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ఒకవైపు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినట్లు కనిపిస్తున్నప్పటికీ, శివసేన (ఠాక్రే వర్గం) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజా ఫలితాలపై స్పందించిన శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ సృష్టిస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముంబై మేయర్ పీఠం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్, ఎన్నికల ఫలితాల గణాంకాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “బీజేపీ ఉదయం నుంచి తప్పుడు అంకెలు చూపిస్తూ ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. పోటీ చాలా తీవ్రంగా ఉంది. మా అభ్యర్థులు వైశాలి పాటంకర్, విశాఖ రౌత్, యశ్వంత్ కిల్లేదార్ వంటి వారు అనేక చోట్ల ముందంజలో ఉన్నారు. బాంద్రా నుంచి రోహిణి కాంబ్లే విజయం సాధించారు. బీజేపీ చూపిస్తున్న అంకెల గారడీని మేము నమ్మడం లేదు” అని రౌత్ వ్యాఖ్యానించారు.
Also Read
- LPG New Rules: ఎల్పీజీ సిలిండర్ న్యూ రూల్స్.. 90 రోజుల గడువు ముగిసింది! ఈ ముఖ్యమైన పనిని ఈరోజే పూర్తి చేయండి
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
Sai Pallavi: సాయి పల్లవి సెలక్షన్ తప్పిందా? కొత్త సినిమా పోస్టర్పై భగ్గుమంటున్న ఫ్యాన్స్!
ముంబై నగరానికి శివసేన ఇప్పటివరకు 23 మంది మేయర్లను అందించిందని గుర్తు చేసిన రౌత్, 24వ మేయర్ కూడా శివసేన (UBT) నుంచే ఉంటారని శపథం చేశారు. “ఠాక్రేను సవాలు చేయాలని చూశారు, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మీరు అధికారం , ధన బలంతో కొన్ని సీట్లు గెలిచి ఉండవచ్చు, కానీ ముంబై పోరాటం వేరు. ఇది ఇంకా ముగియలేదు. అర్థరాత్రి వరకు పూర్తి ఫలితాలు వస్తాయి, అప్పుడు అసలు చిత్రం కనిపిస్తుంది” అని ఆయన ఘాటుగా స్పందించారు.
ఈ పోరాటంలో ఎంఎన్ఎస్ (MNS) అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల గెలుస్తున్నారని, శరద్ పవార్ వర్గానికి కూడా కొన్ని సీట్లు దక్కవచ్చని రౌత్ పేర్కొన్నారు. ముంబై వెలుపల బీజేపీ సాధించిన విజయాలకు అభినందనలు తెలుపుతూనే, ముంబైలో మాత్రం శివసేన గట్టి పోటీని ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు మేయర్ పీఠం కోసం పోరాడుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతున్నప్పటికీ, ముంబై మేయర్ పీఠం విషయంలో మాత్రం సంజయ్ రౌత్ సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి వెలువడే పూర్తి ఫలితాలు ముంబై మున్సిపల్ కోటపై ఎవరు జెండా పాతతారో తేల్చనున్నాయి.
తాజావార్తలు
-
Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు? ఇండియన్ బ్యూటీతో లవ్లో పడ్డ ఇంగ్లండ్ సంచలనం!
-
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరపు న్యాయవాది!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్గా బాస్కి చెప్పేస్తుంది!
-
Hanuman 3D: ‘హను-మాన్’ మ్యాజిక్ మళ్లీ మొదలు.. 3D ట్రైలర్ చూసిన ఫ్యాన్స్కు గూస్బంప్స్!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!