టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగి.. దక్షిణాది అన్ని భాషల్లోనూ స్టార్ డమ్ తెచ్చుకున్న సమంత బాలీవుడ్లో అడుగు పెట్టబోతోంది. అయితే.. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్తో ఉత్తరాది ప్రేక్షకులకు సమంత చేరువైన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్లో సమంత అరంగేట్రం ఎప్పుడు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే స్యామ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో తొలి సినిమా చేస్తుందని ఫుల్…
“ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ… ఈజీ ఈజీ ఈజీ గా తేరి జాన్ లేగ…” అంటూ ఈగ వెండితెరపై చిందులు వేస్తోంటే ఆబాలగోపాలం కేరింతలు కొట్టారు. గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయడంలో తెలుగునాట తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి సీజీలో ఈగను క్రియేట్ చేసి ఈజీగా జనం మదిని దోచేశారు. సరిగా పదేళ్ళ క్రితం జూలై 6న ‘ఈగ’ ప్రేక్షకుల ముందు నిలచింది. వారి మదిని గెలిచింది. బాక్సాఫీస్ నూ షేక్ చేసింది.…
విజయ్ దేవరకొండ ఏం చేసినా ఒక సెన్సేషన్ అవ్వడం ఖాయం. అతని నోటి నుంచి ఏదైనా ఒక మాట జాలువారినా, సినిమాలకు సంబంధించి ఏదైనా పోస్టర్ వచ్చినా.. హాట్ టాపిక్ అయిపోతుంది. ఇప్పుడు అతను రిలీజ్ చేసిన ‘లైగర్’ న్యూస్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ సృష్టిస్తోంది. సెలెబ్రిటీలు సైతం స్పందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సమంత చేసిన బోల్డ్ కామెంట్ అయితే, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘విజయ్ దేవరకొండకి నియమ, నిబంధనలు తెలుసు.…
నిత్యం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. అంతే కాకుండా సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలను సైతం తన దైన శైలిలో సామ్ రియాక్ట్ అవుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై సామ్ ప్రశంసల జల్లు కురుపించారు. చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది సమంత. అయితే ఇంతకీ కేటీఆర్ ను సామ్ ఎందుకు పొగిడిందనే విషయానికి…
నాగ చైతన్య, సమంత విడిపోయి తొమ్మిది నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక.. సందర్భంలో వీరి విడాకులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అసలు తప్పెవరిది.. ఎందుకు విడిపోయారు.. అనే విషయాల్లో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇదే కాదు.. ఈ ఇద్దరు సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని కూడా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది.. ముఖ్యంగా చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడని.. నాగ్ కూడా అదే పనిలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఇక…
గత కొన్ని రోజులుగా నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసింది. నిజానికి నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత కొద్దిరోజులు మౌనంగా ఉన్న ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్, పీఆర్ టీమ్ నేతృత్వంలో ఒకరిపై ఒకరు బురద చల్లడం మొదలెట్టారని తెలుస్తోంది. అయితే… సమంతపై ఎదురు దాడి చేస్తున్న చైతన్య అభిమానులను అడ్డుకోవడం కోసం అన్నట్టుగా ఆమె అభిమానులు ఇటీవల ఎదురుదాడి మొదలెట్టారు. నాగచైతన్య, శోభిత దూళిపాళతో డేటింగ్ చేస్తున్న…
ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత- నాగ చైతన్య పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. నాలుగేళ్ళ క్రితం ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు కొన్ని విబేధాల కారణంగా గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఎప్పుడైతే సామ్, చైతో సపరేట్ అయ్యిందో అప్పటినుంచి అక్కినేని అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏ పని చేసినా నెగెటివ్ గా చిత్రించి కామెంట్స్ లో నెగెటివ్ గా మాట్లాడుతునే ఉంటారు. ఇక కొన్ని కామెంట్స్…
‘ఏమాయ చేశావే’ చిత్రంతో అరంగ్రేటం చేసిన సమంత.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. అనతికాలంలోనే స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ను ఆకర్షిస్తుంటుంది. సమంత ఇన్స్టాగ్రామ్లో చురుకుగా పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తుంది. అయితే ఈమె…