దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 50 కోట్ల వరకు వ్యాక్సిన్ అందించారు. అయితే, మొదటి డోసులు వేగంగా వేస్తున్నా సెకండ్ డోస్ కోసం ఎదురుచూసేవారి సంఖ్య అధికంగా ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, కోవీషీల్డ్, కోవాగ్జిన్తో పాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిని రష్యానుంచి దిగుమతి చేసుకోవడంతో కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు పెను ప్రమాదం తప్పింది. రష్యాకు చెందిన వ్యోమనౌక రీసెర్చ్ మాడ్యూల్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాక ఐఎస్ఎస్ తో డాక్ చేశారు. డాక్ చేసిన కొన్ని నిమిషాల తరువాత హతాత్తుగా మాడ్యూల్కి చెందిన థ్రస్టర్స్ ఫైర్ అయ్యాయి. దీంతో అంతరిక్ష కేంద్రం కొంతమేర అదుపుతప్పింది. వెంటనే రంగంలోకి దిగిన నాసా శాస్త్రవేత్తలు లోపాన్ని సవరించారు. దీంతో అంతరిక్ష కేంద్రం తిరిగి యధాస్థితికి వచ్చింది. డాక్ చేసిన తరువాత కంప్యూర్స్లో అప్డేట్ కాకపోవడంతో…
ప్రపంచంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉన్నది. తగ్గినట్టే తగ్గి అనేక దేశాల్లో కరోనా తిరిగి విజృభిస్తున్నది. కరోనాకు తొలి వ్యాక్సిన్ను తయారు చేసిన రష్యాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ను తయారు చేసినప్పటికీ ఆ దేశంలో వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతున్నది. ఇప్పటికే ఆ దేశంలో నాలుగు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రష్యాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పాటుగా ఇప్పుడు ఆ రష్యాలో గామా వేరింట్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.…
దశాబ్దాల పోరాటం తరువాత ఫెడరల్ క్యాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో కమ్యునిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది. దశాబ్ధాలుగా ఆ పార్టీనే క్యూబాలో పరిపాలన సాగిస్తోంది. అయితే, గత కొంతకాలంగా క్యూబాలో అల్లర్లు చెలరేగుతున్నాయి. కరోనా, ఆర్ధిక కుంగుబాటు, నిరుద్యోగం తదితర అంశాలు దేశాన్ని పట్టిపీడుస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున ప్రజలు హవానాకు చేరుకొని ఉద్యమం చేస్తున్నారు. క్యూబా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్ కనెల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు స్వేచ్చకావాలి వెంటనే అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రజలు…
కరోనా నుంచి పూర్తిగా కోలుకోవాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒక్కటే రక్షణ మార్గం కావడంతో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను వేగంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్ను తయారు చేసిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్కు సంబందించి ట్రయల్స్ను బయటకు ఇవ్వకపోవడంతో అనేక దేశాలు స్పుత్నక్ వీ ని ఆమోదించలేదు. Read: షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య అటు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా…
కరోనాకు మొదటగా వ్యాక్సిన్ను తీసుకొచ్చిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్ను తీసుకొచ్చింది. వ్యాక్సిన్ను తీసుకొచ్చిన తరువాత వేగంగా ఆ దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్పై అక్కడి ప్రజలు పెద్దగా అసక్తి చూపడంలేదు అన్నది వాస్తవం. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ స్పుత్నిక్ వీ ని టీకాగా గుర్తించకపోవడమే ఇందుకు కారణం. రెండు డోసుల వ్యాక్సిన్పై ఇప్పుడు రష్యా ఆరోగ్యశాఖ కొన్ని…
అమెరికా టెకీ సంస్థలపై రాన్సమ్వేర్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు టెకీ కంపెనీలు ఈ రాన్సమ్ వేర్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రష్యాకు చెందిన హాకర్లు ఈ దాడులు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో యూఎస్ ప్రభుత్వం స్పందించింది. అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి మాట్లాడారు. రాన్సమ్వేర్ దాడులను అడ్డుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుందని అన్నారు. Read: “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే…
22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న రష్యాకు చెందిన విమానం ఇవాళ సముదంలో కుప్పకూలింది.. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా గల్లంతయ్యారు.. పెట్రోపవలోస్క్ నుంచి పలనాకు మొత్తం 28 మందితో బయల్దేరిన ఏఎన్-26 విమానాకి పలానా ఎయిర్పోర్ట్కు పదికిలోమీటర్ల దూరంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఇంకా కాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందని అంతా భావిస్తున్న సమయంలో.. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో.. సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు చెబుతున్నారు.…
రష్యాకు చెందిన హ్యాకర్స్ దాడికి అమెరికా కంపెనీలు బెంబెలెత్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం కసేయాపై హ్యాకర్స్ గ్యాంగ్ రాన్సమ్వేర్ తో దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా వందలాది వ్యాపర సంస్థల కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అమెరికాతో సహా మొత్తం 17 దేశాలపై సైబర్ దాడులు జరిగాయి. రష్యాకు చెందిన ఈవిల్ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం. కంపెనీలలో వినియోగించే వీఎస్ఏ టెక్నాలజీపై సైబర్ నేరగాళ్లు రాన్సమ్వేర్తో దాడులు చేశారు. ఈ హ్యాకర్స్…
ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్కతాటిపై నిలబడి బలమైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి. Read: రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్ ప్రపంచంలో చమురుకు డిమాండ్ పెరుగుతున్న…