బ్రిటన్లో కొత్త వేరియంట్ కల్లోలం.. రష్యాలో మరణ మృదంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచ మానవాళి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అందరిమీద దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ ప్రజలను భయపెడుతోంది. ఇప్పుడు డెల్టా వేరియెంట్లోని ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తాజాగా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు డాక్టర్లు ప్రకటించారు.
యూకేలో కొత్త వేరియంట్ కేసులు ఆగడం లేదు. ఇటు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్లో కూడా వెలుగు చూస్తున్నాయి. భారత్లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్లో.. ఇప్పటి వరకు 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి అంత ప్రమాదకరం కాకపోయినా.. వదిలేయడానికి లేదు.. కానీ, ఇప్పుడు మాత్రం ఏవై.4.2 వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది.. కరోనా వైరస్లోని స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్ పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Also Read
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
తాజాగా బ్రిటన్లో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా ప్లస్ (ఏవై.4.2) వేరియంట్ను యూకే ఆరోగ్య భద్రత సంస్థ వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ (వీయూఐ-21ఓసీటీ-01)గా పేర్కొంది. డెల్టాను మించిన వేగంతో ఇది విస్తరిస్తున్నా అంతగా ప్రమాదకరమయింది కాకపోవచ్చంటున్నారు.
అయితే, ఇలాంటి వేరియంట్లు విస్తరించడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. బ్రిటన్లో ఈనెల 20న నమోదైన కేసుల్లో 15,120 వీయూఐ-21ఓసీటీ-01 వేరియంట్ సోకడం వల్ల తలెత్తినవేనని గుర్తించారు. రష్యాలో ఇటు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ప్రతాపం చూపుతోంది కరోనా వైరస్. రష్యాలో 37,678 కేసులు, 1,075 మరణాలు సంభవించాయి. సెప్టెంబరు నాటి గణాంకాలతో పోలిస్తే, ఇప్పుడు కేసులు 70శాతం పెరగగా, మరణాలు 33శాతం అధికంగా నమోదయ్యాయి.
చైనాలో స్కూళ్ళు మూసివేశారు. చైనాలో తాజాగా 47 కేసులు నమోదైనట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. దీంతో ఆంక్షలు విధించారు. విమానాలు రద్దుచేశారు. ఆస్ట్రేలియాలో కేసులు పెరుగుతుండటంతో… టీకా తీసుకోనివారిపై ఆంక్షలు విధించడానికి రంగం సిద్ధం అవుతోంది. ఉక్రెయిన్లో గతంలో లేని విధంగా 23,785 కేసులు, 614 మరణాలు నమోదయ్యాయి. రాజధాని కీవ్, మరికొన్ని చోట్ల ఆంక్షలు విధించారు.
తాజావార్తలు
-
APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
-
Home Cleaning Tips : ఇంట్లో దుర్వాసన వస్తోందా? కారణం ఇదే కావచ్చు.. ఈ చిన్న మార్పులతో ఇల్లు రోజంతా ఫ్రెష్గా ఉంటుంది!
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!