కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ట్రైలర్ తాజాగా విడుదలై రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ అంతటా ‘వాలిమై’ మాయలో పడిపోయింది. ఈ క్రమంలో అజిత్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అజిత్ ను అభిమానులు ప్రేమగా ‘తలా’ అని పిలుచుకునేవారు. అయితే డిసెంబర్ 1న అజిత్ షాకింగ్ ప్రకటన చేశారు. సినీ పరిశ్రమ తనకు ఇచ్చిన గౌరవ బిరుదును నిరాకరిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఒకరన్న విషయం తెలిసిందే. మెగా వారసుడికి లెక్కలేనంతమంది మెగా అభిమానులు తోడుగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇప్పుడు పాన్ ఇండియా రేసులోనూ తన ప్లేస్ ను సుస్థిరం చేసుకోవడానికి ‘ఆర్ఆర్ఆర్’తో ముందడుగు వేశారు చెర్రీ. ఈ సినిమా మాత్రమే కాకుండా రామ్ చరణ్ నటించనున్న తరువాత రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఈ నేపథ్యంలో చెర్రీ తన…
‘ఆర్ఆర్ఆర్’ తెరపైకి రావడానికి కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఓవర్సీస్ ప్రీమియర్లను లెక్కలోకి తీసుకుంటే ఐదు రోజులే! గత కొన్ని వారాలుగా టీమ్ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ త్రయం మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ప్రీ-రిలీజ్ ఈవెంట్లను నిర్వహించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈవెంట్ గురించి చడీచప్పుడూ లేకుండా ఉంది టీమ్. దీంతో ఇక్కడ ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ? అంటూ ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు తెలుగు…
సినిమాలు నిర్మించటం ఓ ఎత్తు. వాటిని సక్రమంగా విడుదల చేయటం ఇంకో ఎత్తు. నిజానికి ఇవాల్టి రోజున సరిగ్గా చక్కటి ప్లానింగ్ తో రిలీజ్ చేయటమే పెద్ద ఎచీవ్ మెంట్. పాన్ ఇండియా సినిమాలకు కూడా ఇది వర్తిస్తుంది. బాలీవుడ్ లో దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను సంవత్సరం ముందే ప్రకటిస్తూ వస్తున్నారు. కరోనా తర్వాత వారి ప్లానింగ్ కొంచెం అటు ఇటు అయింది కానీ లేకుంటే ప్రచారంలో వారి స్ట్రాటజీనే వేరు. పాండమిక్ తర్వాత…
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అత్యధికంగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రం నిస్సందేహంగా ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కూడా ‘బాహుబలి’ బాటలోనే నడవబోతోందని అంటున్నారు. ‘బాహుబలి 2’ వర్కింగ్ స్టైల్ను ‘ఆర్ఆర్ఆర్’ కోసం అనుసరించబోతున్నారట. విషయం ఏమిటంటే సినిమా అధికారిక విడుదలకు ముందు పెయిడ్ ప్రీమియర్లు వేయబోతున్నారట. దీనికి కారణం ఏమిటంటే… మూవీ విడుదలైన ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ సంపాదించడానికి, అధికారిక విడుదలకు ముందే హైప్ని సృష్టించడానికి ఈ స్ట్రాటజీ…
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తదుపరి వాయిదా లేకుండా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళం మినహా మిగిలిన అన్ని వెర్షన్లకు హీరోలు ఇద్దరూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ విషయం గురించి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో చరణ్ లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నాడు. ఇక టాపిక్లోకి వెళితే… కేరళను రామ్ చరణ్ మేనియా పట్టుకుంది. నిన్న కేరళలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది చాలా…
సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలపై ఒమిక్రాన్ దెబ్బ పడుతుందని సినీ లవర్స్ లో టెన్షన్ ఎక్కువైంది. మేకర్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులే ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయా భారీ బడ్జెట్ సినిమాలపై వస్తున్న రూమర్స్ ప్రేక్షకులను కంగారు పెట్టేస్తున్నాయి. మరోపక్క కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయేమో అనే అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ఇలాంటి అనుమానాలే మరోసారి మొదలయ్యాయి. ఢిల్లీలో…
ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘బంగార్రాజు’ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారు. నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్ను శరవేగంగా పూర్తి చేశారు. ఇటీవలే నాగ చైతన్య సైతం సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో వెండితెరపైకి రానుంది అనేది…
2022 సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలకు ఇది కష్ట సమయం. పెరుగుతున్న కోవిడ్, ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి కొన్ని బహిరంగ ప్రదేశాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ, ఈ రోజు ఢిల్లీలోని థియేటర్లను తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి…