ఆస్ట్రేలియా క్రికెట్లో పెను విషాదం నెలకొంది. ఆ జట్టు దిగ్గజం, మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డుప్రమాదంలో మరణించాడు. టౌన్స్విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సైమండ్స్ 26 టెస్టులు ఆడి 1,462 పరుగులు…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో రామకృష్ణ అనే లెక్చరర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని 108 వాహనం ద్వారా బంధువులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అయితే బాధితుడు రామకృష్ణకు సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు చికిత్స చేశారు. బాధితుడి తలకు కట్టు కట్టి సెలైన్లు పెట్టారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఇంజక్షన్ చేసి ఊరుకున్నాడు. దీంతో రామకృష్ణ పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే…
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు.…
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపుతోంది. అయితే ఈ ఘటనపై ప్రధాని మోదీ నిర్ఘాంత పోయారు. మృతుల కుటుంబాలకు సానుభూతి, గాయపడిన వారితో ప్రార్థనలని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మరణించిన వారి బంధువులకు అందజేయబడుతుందని తెలిపారు. గాయపడిన వారికి రూ. 50వేలు అందించనున్నట్లు ప్రధాని మోదీ ట్విటర్ ద్యారా వెల్లడించారు. కాగా .. కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత…
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైమవతి (25), నాగరాణి(23) అనే ఇద్దరు యువతులు గచ్చిబౌలి DLF వద్ద నివాసం ఉంటున్నారు. నాగరాణి ఓప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తోంది. నిన్న రాత్రి హైమవతి ,నాగరాణి ఇద్దరు ద్విచక్ర వాహనంపై DLF నుండి గచ్చిబౌలి స్టేడియం వైపు వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో నాగరాణికి తీవ్ర రక్తస్రావ్యం కావడంతో.. అక్కడికక్కడే మృతి చెందగా..…
బాలాజీ జిల్లా శ్రీకాళహస్తి శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. నాయుడుపేట-పూతలపట్టు రహదారిపై లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరికి చెందిన 12 మంది ఆటోలో నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరిగివస్తుండగా శ్రీకాళహస్తి సమీపంలోని అర్ధనారీశ్వరాలయం సమీపంలో లారీ ఢీకొట్టింది. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణంగా లారీ డ్రైవర్…
అధికారం అంటే హంగు, ఆర్భాటం మాత్రమే కాదు. పదిమందికి సాయం చేయడం. ప్రమాదానికి గురైనవారికి తమవంతు సాయం చేసి ఆస్పత్రికి తరలించడం. గతంలో తమ అధినేత జగన్ చూపిన మానవత్వాన్ని ఆయన మంత్రులు కూడా చేసి చూపించారు. తన కాన్వాయ్ వెళుతుండగా అంబులెన్స్ రావడం గమనించిన సీఎం జగన్ ఆ అంబులెన్స్ దారి ఇచ్చి.. అందులో వున్న రోగుల్ని కాపాడారు. అదే బాటలో నడిచారు. కొత్తగా మంత్రులైన ఇద్దరు నేతలు. వారెవరో కాదు డిప్యూటీ సీఎం బూడి…
రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనకనుంచి ఢీ-కొంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు. గత రాత్రి 10- 30 నిముషాలకు తిరువూరు నుండి మియాపూర్ సర్వీస్ (3794) బయలుదేరింది ఏపీఎస్ ఆర్టీసీ బస్. హైదరాబాద్ వచ్చే క్రమంలో నగర శివారులో ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. తెల్లవారుజామున 4-30 గంటలకు హైదరాబాద్ శివారు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సుని వెనుక నుంచి ఢీ…
నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కల పల్లి సమీపంలో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొనడంతో నలుగురి మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు. వీరంతా నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వాసులుగా గుర్తించారు. ఐదుగురు కడప నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోనే కారు…
మన సంప్రదాయంలో ఎన్నో విశిష్టతలు వున్నాయి. చనిపోయింది మనిషైనా, చివరికి జంతువైనా దానికి అంతిమ సంస్కారాలు చేయడం పరిపాటి. చనిపోయిన ఒక వానరానికి అంత్యక్రియలు జరిపారు ఓ గ్రామస్తులు. చనిపోయింది కోతే కదా అని వదిలేయలేదు అక్కడి ప్రజలు. దానిని దైవస్వరూపంగా భావించి అత్యంత వైభవంగా అంతిమ యాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ యాత్రలో పాల్గొనడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఓ వానరం మరణించింది. మనం…