మహారాష్ట్రలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై- అహ్మదాబాద్ హైవేపై పాల్ఘర్ జిల్లాలోని వాగోభా ఖిండ్ వద్ద బస్సు లోయలో పడింది. దాదాపు 25 అడుగుల లోతు లోయలో పడటంతో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో ఐగుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర ఆర్టీసికి చెందిన బస్సు ఉత్తర మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోన భుసావల్ ననుంచి పాల్ఘర్ లోని బోయిసర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున…
మహారాష్ట్రలోని చంద్రపూర్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్, కలప లోడు ట్రక్కు ఢీకొనడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 9 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే బాధితులు పూర్తిగా మంటల్లో కాలి బూడిదగా మిగిలిపోయారు. గురువారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చంద్రాపూర్-ముల్ రోడ్డులో ఈ ప్రమాదం…
రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోకనగర్ గ్రామ శివారు పర్శ తండా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన లో ఐదుగురు మరణించారు. తొలుత అక్కడికక్కడే ముగ్గురి మృతి చెందగా..చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ముగ్గురు. పెళ్లి సామాను కొనుగోలుకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది ట్రాక్టర్. ఈ ప్రమాదంలో మరణించినవారిని…
పద్మశ్రీ రామయ్య చెట్లకు నీళ్లు పోయడానికి రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు . ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి కి చెందిన వనజీవి రామయ్యకు ఉదయం లేచిన వద్ద నుంచి నీళ్లు పోయడం చెట్ల పొదల్లో తుపాలను తొలగించడం, ఎర్రచందనం, చింత చెట్ల గింజలను ఏరుకుని వాటిని మళ్ళీ నాటడం అలవాటు. ఎనిమిది పదుల వయసులో కూడా పద్మశ్రీ రామయ్య తాను నాటిన చెట్లను జాగ్రత్త గా చూసుకోవడం అలవాటుగా మారింది. అదేవిధంగా ఇవాళ…
నందమూరి బాలకృష్ణ ఇంటివద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో బాలయ్య ఇంటి గేటు ధ్వంసమయ్యింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న బాలకృష్ణ ఇంటివైపుకు ఒక వాహనం దూసుకువచ్చింది. బ్రేకులు సరిగా పడని కారణంగా ఆ వాహనం అదుపుతప్పి బాలయ్య ఇంటి గేటును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో బాలకృష్ణ ఇంటి గేటు పూర్తిగా ధ్వంసమయ్యింది. వాహనాన్ని ఒక యువతి నడపడం విశేషం.. అంబులెన్స్ కి దారి ఇచ్చే…
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మృతులు పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మదనపల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. Andhra Pradesh: ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్క్ …
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కన్నడ నిర్మాత అనేకల్ బాలరాజ్ (58) దుర్మరణం పాలయ్యారు. బెంగళూరు జేపీ నగరలో నివాసముంటున్న ఆయన మార్కింగ్ వాక్ కు అని వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం ఆయన రోడ్డుపక్కన కారు ఆపి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక బైక్ అతివేగంతో ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్నటి నుంచి చికిత్స తీసుకుంటూ…
ఆస్ట్రేలియా క్రికెట్లో పెను విషాదం నెలకొంది. ఆ జట్టు దిగ్గజం, మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డుప్రమాదంలో మరణించాడు. టౌన్స్విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సైమండ్స్ 26 టెస్టులు ఆడి 1,462 పరుగులు…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో రామకృష్ణ అనే లెక్చరర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని 108 వాహనం ద్వారా బంధువులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అయితే బాధితుడు రామకృష్ణకు సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు చికిత్స చేశారు. బాధితుడి తలకు కట్టు కట్టి సెలైన్లు పెట్టారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఇంజక్షన్ చేసి ఊరుకున్నాడు. దీంతో రామకృష్ణ పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే…
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు.…