Central Govt: తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారా బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్రం మరోసారి రైతులకు అండగా నిలిచింది. ఇటీవల, 2021-22 రబీ సీజన్, 2022-23 ఖరీఫ్ సీజన్ కోసం 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా-బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Warangal Accident: వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఒకే రోజు మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెండు చోట్ల సొంత అన్నదమ్ములు చనిపోతే మరో చోట తాత,మనవరాలు రోడ్డు ప్రమాదంతో మృత్యువాత పడ్డారు.
Kerala: 16 ఏళ్ల బాలుడు చనిపోయి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. 10 తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సారంగ్ 10వ తరగతిలో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి టాపర్ గా నిలిచారు. సారంగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలవడం ఆ కుటుంబాన్ని మరింతగా బాధపడుతోంది.
Road accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గోనుపాడు సమీపంలోని పర్చర్లమిట్ట వద్ద శనివారం ఉదయం వేగంగా వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఆటోను ఢీకొంది.
గుజరాత్లోని అమ్రేలి జిల్లాలోని సావర్కుండ్లా పట్టణం సమీపంలో ఆయన నడుపుతున్న కారు బుల్డోజర్ను ఢీకొనడంతో గుజరాత్ మాజీ వ్యవసాయ మంత్రి వల్లభ్భాయ్ వాఘాసియా మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.