సరైన లక్ష్యాన్ని నమోదు చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. మ్యాచ్లో తాము 20-25 పరుగులు తక్కువగా చేశామని, అయితే ఆటలో ఇవన్నీ సహజమే అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకొని ముందుకు సాగాలనుకుంటున్నామన్నాడు. మ్యాచ్లో తమకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయని, అవేంటో ఇప్పుడు చెప్పలేను అని పంత్ తెలిపాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో 8 వికెట్ల…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మ్యాచ్ నంబర్-13లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నోపై పంజాబ్ కింగ్స్ సాలిడ్ విక్టరీ సాధించింది. నిర్ణీత 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యా్చ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంజాబ్ కింగ్స్ పేసర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే 3 కీలక…
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యా్చ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన లక్నోకు పంజాబ్ బౌలర్స్ చెమటలు పట్టించారు. పంజాబ్ కింగ్స్ పేసర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేయడంతో భారీ స్కోరుకు బ్రేకులు పడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7…
ఐపీఎల్ లో నేడు మరో రసవత్తర మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. లక్నో, పంజాబ్ జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండడంతో ఈ…
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లలో హార్డ్ హిట్టర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో గెలిచిన పంజాబ్.. మరో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ దాంట్లో ఓడి, మరోదాంట్లో విజయం సాధించిన లక్నో..…
మైదానంలో క్లిష్ట సమయాల్లో ఎలా ఉండాలో తన మెంటార్ ఎంఎస్ ధోనీ నుంచి నేర్చుకొన్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మన చేతుల్లో లేనివాటి గురించి ఆలోచించడం అనవసరమన్నాడు. భీకర ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించడం సంతోషం కలిగించిందన్నాడు. శార్దూల్ ఠాకూర్ అద్భుతం అని పంత్ ప్రశంసించాడు. గురువారం ఉప్పల్ మైదానం వేదికగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్…
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2025ని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఓటమితో ఆరంభించింది. విశాఖపట్నం వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ 9 వికెట్స్ కోల్పోయి మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన తప్పిదాల కారణంగా లక్నో ఓడిపోవాల్సి వచ్చింది. 20వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్ మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని పంత్ మిస్…
Rishabh Pant: వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. LSG బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇది ఇలా ఉంటే కెప్టెన్ రిషబ్ పంత్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఈ పోరులో పంత్ ఒక్క పరుగు కూడా చేయకుండా…
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలు ముస్సోరీలో జరుగుతున్నాయి. బుధవారం, గురువారం రెండ్రోజులుగా ఐటీసీ హోటల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సతీసమేతంగా కలిసి వచ్చాడు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.