Rishabh Pant: రిషబ్ పంత్ తప్పిదాలు.. లక్నో ఓనర్ ఏమన్నాడంటే?
- ఓటమితో ఐపీఎల్ 2025ని ఆరంభించిన లక్నో
- ఢిల్లీ మ్యాచ్లో రిషబ్ పంత్ తప్పిదాలు
- ఓటమిపై సానుకూలంగా స్పందించిన లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా
ఐపీఎల్ 2025ని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఓటమితో ఆరంభించింది. విశాఖపట్నం వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ 9 వికెట్స్ కోల్పోయి మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన తప్పిదాల కారణంగా లక్నో ఓడిపోవాల్సి వచ్చింది. 20వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్ మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని పంత్ మిస్ చేశాడు. ఒకవేళ పంత్ ఆ స్టంపౌట్ చేసి ఉంటే ఢిల్లీ ఆలౌటై ఓడిపోయేది. అయితే టీమ్ ఓడితే మండిపడే లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించారు.
ఢిల్లీ క్యాపిటల్స్పై ఓడినా అద్భుత క్రికెట్ ఆడారని లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లను సంజీవ్ గోయెంకా మెచ్చుకున్నారు. ఢిల్లీ డగౌట్లో ఆటగాళ్లతో సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్లో పవర్ప్లేలో ఆడిన విధానం అద్భుతం. బాగా ఆడినా కొన్నిసార్లు ఓటములు ఎదురవుతాయి. మనది యువ జట్టు. సానుకూల అంశాలతో ముందుకువెళదాం. 27న జరిగే మ్యాచ్లో మెరుగైన ఫలితాన్ని రాబట్టేందుకు ప్రయత్నిద్దాం. నిజమే ఈ రోజు కాస్త నిరాశ చెందినా.. మంచి మ్యాచ్ ఇది. ప్రతి ఒక్కరు బాగా ఆడారు’ అని ప్రశంసించారు. మార్చి 27న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో లక్నో మ్యాచ్ ఆడనుంది.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Also Read: IPL 2025: నికోలస్ పూరన్ అరుదైన రికార్డు.. హిట్మ్యాన్ రోహిత్ వల్ల కూడా కాలే!
ఐపీఎల్ 2024లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్లో లక్నోను సన్రైజర్స్ ఓడించింది. లక్నో 165/4 స్కోర్ చేయగా.. లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే సన్రైజర్స్ బాధేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేశారు. ఇద్దరు కలిసి 14 సిక్సర్లు, 16 ఫోర్లతో 166 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. ఈ ఓటమి లక్నో రన్ రేట్పై పడి.. చివరికి ప్లేఆఫ్కు వెళ్లకుండా చేసింది. ఈ ఓటమి తర్వాత సంజీవ్ గోయెంకా అప్పటి కెప్టెన్ లోకేష్ రాహుల్తో గొడవ పడ్డాడు. అనంతరం రాహుల్ లక్నోకు బై చెప్పాడు. మెగా వేలంలో ఢిల్లీలో చేరాడు.
“𝐿𝑒𝑡’𝑠 𝑙𝑜𝑜𝑘 𝑎𝑡 𝑡ℎ𝑒 𝑝𝑜𝑠𝑖𝑡𝑖𝑣𝑒𝑠, 𝑎𝑛𝑑 𝑙𝑜𝑜𝑘 𝑓𝑜𝑟𝑤𝑎𝑟𝑑” 🙌 pic.twitter.com/AXE8XqiQCo
— Lucknow Super Giants (@LucknowIPL) March 25, 2025
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో