Rishabh Pant: రిషబ్ పంత్ తప్పిదాలు.. లక్నో ఓనర్ ఏమన్నాడంటే?
- ఓటమితో ఐపీఎల్ 2025ని ఆరంభించిన లక్నో
- ఢిల్లీ మ్యాచ్లో రిషబ్ పంత్ తప్పిదాలు
- ఓటమిపై సానుకూలంగా స్పందించిన లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025ని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఓటమితో ఆరంభించింది. విశాఖపట్నం వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ 9 వికెట్స్ కోల్పోయి మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన తప్పిదాల కారణంగా లక్నో ఓడిపోవాల్సి వచ్చింది. 20వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్ మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని పంత్ మిస్ చేశాడు. ఒకవేళ పంత్ ఆ స్టంపౌట్ చేసి ఉంటే ఢిల్లీ ఆలౌటై ఓడిపోయేది. అయితే టీమ్ ఓడితే మండిపడే లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించారు.
ఢిల్లీ క్యాపిటల్స్పై ఓడినా అద్భుత క్రికెట్ ఆడారని లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లను సంజీవ్ గోయెంకా మెచ్చుకున్నారు. ఢిల్లీ డగౌట్లో ఆటగాళ్లతో సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్లో పవర్ప్లేలో ఆడిన విధానం అద్భుతం. బాగా ఆడినా కొన్నిసార్లు ఓటములు ఎదురవుతాయి. మనది యువ జట్టు. సానుకూల అంశాలతో ముందుకువెళదాం. 27న జరిగే మ్యాచ్లో మెరుగైన ఫలితాన్ని రాబట్టేందుకు ప్రయత్నిద్దాం. నిజమే ఈ రోజు కాస్త నిరాశ చెందినా.. మంచి మ్యాచ్ ఇది. ప్రతి ఒక్కరు బాగా ఆడారు’ అని ప్రశంసించారు. మార్చి 27న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో లక్నో మ్యాచ్ ఆడనుంది.
Also Read
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
Also Read: IPL 2025: నికోలస్ పూరన్ అరుదైన రికార్డు.. హిట్మ్యాన్ రోహిత్ వల్ల కూడా కాలే!
ఐపీఎల్ 2024లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్లో లక్నోను సన్రైజర్స్ ఓడించింది. లక్నో 165/4 స్కోర్ చేయగా.. లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే సన్రైజర్స్ బాధేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేశారు. ఇద్దరు కలిసి 14 సిక్సర్లు, 16 ఫోర్లతో 166 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. ఈ ఓటమి లక్నో రన్ రేట్పై పడి.. చివరికి ప్లేఆఫ్కు వెళ్లకుండా చేసింది. ఈ ఓటమి తర్వాత సంజీవ్ గోయెంకా అప్పటి కెప్టెన్ లోకేష్ రాహుల్తో గొడవ పడ్డాడు. అనంతరం రాహుల్ లక్నోకు బై చెప్పాడు. మెగా వేలంలో ఢిల్లీలో చేరాడు.
“𝐿𝑒𝑡’𝑠 𝑙𝑜𝑜𝑘 𝑎𝑡 𝑡ℎ𝑒 𝑝𝑜𝑠𝑖𝑡𝑖𝑣𝑒𝑠, 𝑎𝑛𝑑 𝑙𝑜𝑜𝑘 𝑓𝑜𝑟𝑤𝑎𝑟𝑑” 🙌 pic.twitter.com/AXE8XqiQCo
— Lucknow Super Giants (@LucknowIPL) March 25, 2025
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!