Ricky Ponting Chose Rishabh Pant Over Ishan Kishan For T20 World Cup: టీ20 వరల్డ్కప్-2022 టోర్నీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. భారత జట్టులో ఏయే ఆటగాళ్లకి చోటిస్తే బాగుంటుందన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చాలామంది ఆటగాళ్లు లైనప్లో ఉండటంతో, ఎవరికి చోటు దక్కుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే.. కొందరు మాజీలు మాత్రం రిషభ్ పంత్ని తీసుకోవద్దని సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన పంత్, ఆ సిరీస్లో బ్యాట్స్మన్గా…
రిషభ్ పంత్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. టెస్టుల్లో అదరగొడుతున్నాడు కానీ, పరిమిత ఓవర్లలోనే సరిగ్గా రాణించట్లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో విఫలమైన పంత్.. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో మాత్రం మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతోనూ, రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతోనూ చెలరేగిపోయాడు. ఇలా వేర్వేరు ఫార్మాట్లలో భిన్నంగా రాణిస్తున్న పంత్ ఆటపై తాజాగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టెస్టుల్లో యథావిధిగా పంత్ స్థానాన్ని కొనసాగిస్తూనే..…
కొంతకాలం నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న రిషభ్ పంత్.. ఇంగ్లండ్తో జరుగుతోన్న ఐదో టెస్ట్ మ్యాచ్లో మాత్రం అదరగొట్టేశాడు. వరుస వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు.. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగాడు. అదే జోష్ను రెండో ఇన్నింగ్స్లోనూ కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డ్ని సాధించగలిగాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 146 పరుగులు చేసిన పంత్.. సెకండ్ ఇన్నింగ్స్లో 57 పరుగులు సాధించాడు. తద్వారా.. ఒకే టెస్టులో శతకం, అర్దశతకం సాధించిన…
దక్షిణాఫ్రితో టీ20 సిరీస్లో భారత జట్టుకు రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే! అయితే, అతడు సమర్థవంతంగా జట్టుని నడిపించలేకపోయాడని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా.. మొదట్లో రెండు మ్యాచ్లు ఘోరంగా ఓడిపోవడంతో, అతడి కెప్టెన్సీని అందరూ తప్పుపట్టారు. ఎలాంటి నాయకత్వ లక్షణాలు అతనిలో లేవని, రిషభ్ స్థానంలో ఓ సీనియర్ ఆటగాడ్ని కెప్టెన్గా ఎంపిక చేయాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తొలి రెండు ఓటముల తర్వాత భారత్ రెండు మ్యాచ్లు కైవసం చేసుకున్నా.. అందులో రిషభ్…
కేవలం బ్యాట్తోనో, బంతితోనో కాదు.. అప్పుడప్పుడు క్రికెటర్లు కొన్ని అనూహ్యమైన రికార్డులు కూడా సృష్టిస్తుంటారు. ఇప్పుడు దినేశ్ కార్తీక్ ఖాతాలోనూ అలాంటి అరుదైన రికార్డే నమోదైంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బెస్ట్ ఫినిషర్గా అవతారమెత్తి భారత జట్టులోకి అడుగుపెట్టిన ఈ వెటరన్ వికెట్ కీపర్.. తన అంతర్జాతీయ కెరీర్లో 10 మంది కెప్టెన్ల కింద ఆడి రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంతవరకు ఏ ఒక్క ఆటగాడు ఇంతమంది కెప్టెన్ల కింద ఆడిన దాఖలాలు లేవు.…
గత మూడేళ్ల నుంచి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోన్న దినేశ్ కార్తీక్.. ఎట్టకేలకు దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కంబ్యాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బెస్ట్ ఫినిషర్గా అవతరించి, జట్టులో చోటు సంపాదించాడు. ఈ సిరీస్లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దినేశ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్ననారు. తాజాగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ కూడా చేరిపోయాడు. ‘‘ప్రస్తుతం…
కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి లాంటి సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత.. తిరిగి పుంజుకున్న టీమ్ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడేందుకు రెడీ అయింది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో బరిలోకి దిగి.. తొలి రెండు మ్యాచ్ల్లో ఎదురు దెబ్బల తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్ను సమం చేసిన టీమ్ఇండియా.. అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు సమిష్టిగా సత్తాచాటి కప్పు కొట్టేయాలని…
అక్టోబర్ నుంచి టీ20 వరల్డ్కప్-2022 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తుది జట్టులో ఎవరెవరికి స్థానం కల్పిస్తే బాగుంటుందన్న విషయాలపై తన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నాడు. రీసెంట్గానే ఇషాన్ కిషన్ను ప్లేయింగ్ ఎలెవన్లో తీసుకోవాల్సిందేనని, అతడ్ని ఓపెనర్గా రంగంలోకి దింపితే పరుగుల వర్షం కురవడం ఖాయమని ఆయనన్నాడు. కానీ, దినేశ్ కార్తీక్ని ఎంపిక చేయడం వృధా అంటూ బాంబ్ పేల్చాడు. కార్తీక్ ఆఖర్లో కేవలం రెండు, మూడు ఓవర్లు మాత్రమే ఆడతానంటే కుదరదని…
భారీ స్కోరు చేసినా తొలి టీ20 మ్యాచ్ ఓడిపోవడంతో.. రెండో మ్యాచ్ నెగ్గి దక్షిణాఫ్రికాపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఈసారి బ్యాట్స్మన్లు చేతులెత్తేయడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో.. ఐదు మ్యాచ్లో టీ20 సిరీస్లో దఫ్రికాఫ్రికా 2-0తో ఆధిక్యంలో ఉంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మన్లను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చివరివరకూ ప్రయత్నించారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, రిషభ్ పంత్ మాత్రం మరింత మెరుగ్గా బౌలింగ్ వేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.…
తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది దక్షిణాఫ్రికానే. ఒత్తిడిలోనూ ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు భారత్కు వరుసగా రెండో ఓటమి రుచి చూపించారు. టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైన నేపథ్యంలో కెప్టెన్ రిషభ్…