Gold Robbery: బంగారం, డబ్బు కోసం పట్టపగలే దారుణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Robbery: బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో దోపిడీ దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బంగారం దోపిడీ కోసం దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. కత్తులు, మారణాయుధాలతో దాడులు చేయడం లేదా హత్యలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన ఓ దోపిడీ దొంగ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. అటు నెల్లూరులోనూ ఓ మహిళపై కత్తితో ఓ దోపిడీ దొంగ దాడి చేశాడు.
బంగారం, డబ్బు కోసం పట్టపగలే ఓ దుండగుడు దారుణానికి తెగించాడు. దొంగతనానికి వచ్చి ఇంట్లో ఉన్న మహిళను దారుణంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన విశాఖ నగరంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆరిలోవ పాతపోలీస్ స్టేషన్ ఎదురుగా కనకదుర్గనగర్లో కాపు రమణ, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త రమణ జీవీఎంసీ ఉద్యాన విభాగంలో పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 9 గంటలకు ఎప్పటిలాగే విధులకు వెళ్లారు. భార్య లక్ష్మి ఒక్కరే ఇంట్లో ఉండగా ఉదయం 10 గంటలకు ఓ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ దృశ్యాలన్నీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చుట్టు పక్కల పరిసరాలను పరిశీలించి వెళ్లిపోయాడు.
Also Read
- Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
- Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
- Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
- Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
తర్వాత మళ్లీ 11 గంటల సమయంలో నెత్తిపై టోపీ, ముఖానికి మాస్క్ ధరించి ఎవరికి కనపడకుండా వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న లక్ష్మిపై దాడిచేసి గొంతునులిమి ప్రాణం తీశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు, బీరువాలో ఉన్న రూ.5 లక్షల నగదును తీసుకుని పారిపోయాడు. ఈమెను హత్య చేసిన విషయం కనీసం ఇరుగు పొరుగు వారికి కూడా తెలీయనీయకుండా దొంగతనానికి వచ్చిన దుండగుడు హత్య చేసి పారిపోయాడు.
ఉదయం డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం 5గంటలకు ఇంటికొచ్చి భార్యను పిలిచాడు. ఎంత పిలిచినా స్పందించలేదు. ఎలాంటి స్పందన భార్య నుంచి లేకపోయే సరికి కంగారు పడ్డాడు. వెంటనే లోపలికి వెళ్లి చూసేసరికి భార్య విగత జీవిగా పడి ఉంది. ముక్కులో నుంచి రక్తం వచ్చి ఉండటం గమనించారు భర్త. భార్య చనిపోవడంతో షాక్కు గురై బిగ్గరగా అరవడంతో స్థానికులు చేరుకున్నారు. భార్య ఒంటిమీద బంగారం, బీరువాలో నగదు లేకపోవడంతో కుమార్తె, కుమారుడు, అల్లుడికి తెలిపారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు అంబులెన్స్ పంపించారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే లక్ష్మి మరణించినట్లు తెలిపారు. క్లూస్ టీం ఘటనా స్థలిలో ఆధారాలను సేకరించింది.
బాగా రెక్కీ నిర్వహించిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. భర్త రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతురాలి కుమార్తె, కుమారుడు, బంధువులు అక్కడికి సమీపంలో నివాసం ఉంటున్నా సాయంత్రం వరకు ఆమె మృతిచెందిన విషయం గుర్తించలేకపోయారు.
Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!
మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రభుత్వ టీచర్ మీద ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. ఒంటి మీద ఉన్న నగలు లాక్కెళ్లాడు. గూడూరుకు చెందిన ప్రభుత్వ మహిళ ఉపాధ్యాయురాలు హరిత.. బాలాయపల్లి మండలం గోట్టిగాడి గ్రామంలో ఉండే ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ప్రతి రోజూ గూడూరు నుంచి ఆమె స్కూలుకు వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు బస్ సమయానికి లేకపోవడంతో గూడూరులోని అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద వెంకటరమణయ్య అలియాస్ చిన్న అనే వ్యక్తికి చెందిన ఆటో ఎక్కింది.
ఆటోలో హరిత ఒక్కరే ఉండటంతో.. ఆమె మెడలో ఉండే నగలు మీద ఆటో డ్రైవర్ కన్నేశాడు. బెదిరించి.. భయపెట్డి.. లేదంటే చంపి అయినా నగలు దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్కూల్కి వెళ్తున్న క్రమంలో బాలాయపల్లి సమీపంలోకి వెళ్లగానే కత్తితో బెదిరించాడు. మెడలో ఉండే నగలు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తానని భయపెట్టాడు. ఈ సమయంలో హరిత ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె మెడ మీద కత్తితో గాటు పెట్టాడు. ఇదే సమయంలో అతనికి కూడా రక్త గాయాలు అయ్యాయి. అనంతరం మెడలో ఉండే చైన్ తీసుకుని అక్కడి నుంచి అతను పరారయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న హరిత జరిగిన విషయాన్ని తోటి టీచర్స్ కి ఫోన్ చేసి చెప్పారు. వారు హాస్పిటల్ కి తరలించారు.
AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!
హరితకు గొంతు మీద తీవ్ర గాయాలు అవ్వడంతో నెల్లూరులోని ఓ ప్రవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్ వెంకట రమణయ్యను మూడు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నగలు రికవరీ చేయడంతో పాటు ఆటోని సీజ్ చేశామని వెల్లడించారు పోలీసులు. మొత్తానికి బంగారం కోసం దోపిడీ దొంగలు చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఐతే ఇలాంటి దోపిడీ దొంగలు బెయిల్పై బయటకు రాకుండా.. కఠిన శిక్షలు అమలు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
-
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!